Kohli Records: రన్మెషీన్ ఖాతాలో మరో రికార్డ్.. IPL లో ఒకేఒక్కడు
ఐపీఎల్ చరిత్రలో 30+ స్కోరు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. IPL 2023 27వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు
- Author : Praveen Aluthuru
Date : 20-04-2023 - 5:41 IST
Published By : Hashtagu Telugu Desk
Kohli Records: ఐపీఎల్ చరిత్రలో 30+ స్కోరు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. IPL 2023 27వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మధ్య మొహాలీ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఫాఫ్ డు ప్లెసిస్ వెన్ను గాయం కారణంగా విరాట్ కోహ్లీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతంగా ఆరంభించి అర్ధ సెంచరీ చేశారు. ఈ సందర్భంగా కోహ్లీ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డును కూడా నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్లో రన్మెషీన్ కోహ్లి మినహా మరే ఆటగాడు ఈ రికార్డును సాధించలేకపోయాడు. నిజానికి పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సిబి స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి జట్టుకు శుభారంభం అందించాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 59 పరుగులు సాధించి ఓ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 100 మ్యాచ్ల్లో 30 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా కింగ్ కోహ్లీ నిలిచాడు. దీంతో విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో మొత్తం 600 ఫోర్లు పూర్తి చేసుకున్నాడు.
విరాట్ కోహ్లీ చివరిసారిగా RCB జట్టుకు అక్టోబర్ 11, 2021న కెప్టెన్గా వ్యవహరించాడు. కాగా.. పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ మొత్తం 556 రోజుల తర్వాత మళ్లీ కెప్టెన్సీలోకి వచ్చాడు. ఫాఫ్ డు ప్లెసిస్ వెన్ను గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.
Read More: IPL 2023: కోహ్లిని హగ్ చేసుకున్న గంభీర్.. అప్పుడు అలా ఇప్పుడు ఇలా?