Viral Video: పోలీసును చితక్కొట్టిన వ్యక్తి…వీడియో వైరల్..!!
మధ్యప్రదేశ్ ఇండోర్ లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అంతాచూస్తుండగానే పోలీసు నుంచి లాఠీ లాక్కొన్న ఓ వ్యక్తి...
- Author : Hashtag U
Date : 10-04-2022 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
మధ్యప్రదేశ్ ఇండోర్ లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అంతాచూస్తుండగానే పోలీసు నుంచి లాఠీ లాక్కొన్న ఓ వ్యక్తి…ఆయన్ను చితక్కొట్టాడు. వెంబడించి మరీ కొట్టాడు. ఈ ఘటన ఇండోర్ లో జరిగింది. వెంకటేశ్ నగర్ ప్రాంతంలో శుక్రవారం 25ఏళ్ల దినేశ్ ప్రజాపతి…పోలీసు కానిస్టేబుల జై ప్రకాశ్ జైస్వాల్ బైకులు రెండూ స్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో వారిద్దరూ కూడా కిందపడిపోయారు. ఈ ప్రమాదంపై ఆగ్రహించిన దినేశ్, కానిస్టేబుల్ జైస్వాల్ నుంచి లాఠీ లాక్కొన్నాడు. ఆయనపై దాడి చేశాడు. పైకి లేచి వెళ్తున్న పోలీసును వెంబడించి మరీ చితకబాదాడు. పోలీసును కొడుతుంటే అక్కడున్నవారు చూస్తూ ఉండిపోయారే తప్పా…కానిస్టేబుల్ ను కాపాడేందుకు ముందుకు రాలేదు.
ఈ ఘటనలో గాయపడిన పోలీసు కానిస్టేబుల జై ప్రకాశ్ జైస్వాల్ ఫిర్యాదు చేశారు. పోలీసులు దినేశ్ ప్రజాపతిని అరెస్టు చేసి…పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనను కొందరు స్థానికులు మొబైల్ ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.
In Indore Police constable Jai Prakash Jaiswal assaulted in full public view accused has been arrested @ndtv @ndtvindia pic.twitter.com/NElwWSXOXq
— Anurag Dwary (@Anurag_Dwary) April 9, 2022