Twitter: ట్విట్టర్ లో సెలబ్రిటీలకు బ్లూ టిక్ మళ్లీ వచ్చేసిందోచ్?
తాజాగా ట్విట్టర్ సంస్థ సినిమా,రాజకీయ, క్రీడా ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు, సామాన్యుల ఖాతాలో బ్లూటిక్
- By Nakshatra Published Date - 05:55 PM, Sun - 23 April 23
తాజాగా ట్విట్టర్ సంస్థ సినిమా,రాజకీయ, క్రీడా ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు, సామాన్యుల ఖాతాలో బ్లూటిక్ ను తొలగించిన సంగతి మనందరికీ తెలిసిందే. కాగా కేవలం ట్విటర్ బ్లూ సర్వీస్లకు డబ్బులు చెల్లించిన వారికి బ్లూ చెక్మార్క్ ఇచ్చింది. దీంతో చాలా మంది సెలబ్రిటీలు బ్లూ టిక్ను కోల్పోయారు. అయితే, ట్విటర్ యజమాని ఎలాన్ మస్క్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్లూ టిక్ ను ఇచ్చే విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కనీసం 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల ఖాతాలకు మాత్రమే బ్లూ టిక్ ను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బ్లూ చెక్మార్క్ కోల్పోయిన చాలా మంది ప్రముఖుల ఖాతాల్లో తిరిగి బ్లూ టిక్ కనిపించింది. బాలీవుడ్ తారలు షారుక్ ఖాన్, అలియా భట్, క్రికెటర్లు కోహ్లీ, ధోనీ సహా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్ బిల్ గేట్స్, రాజకీయ ప్రముఖులు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ ఇలా చాలామంది ప్రముఖుల ట్విటర్ ఖాతాలన్నింటికీ బ్లూ టిక్ మార్క్ వచ్చింది. వీరంతా రెండు రోజుల క్రితం బ్లూ చెక్ మార్క్ కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు. అయితే, వీరంతా డబ్బులు చెల్లించి ట్విటర్ బ్లూ సేవలను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతుండగా ఆ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు.
కేవలం వీరి ఖాతాలకు మాత్రమే కాకుండా దివంగత ప్రముఖుల ఖాతాలకు సైతం తిరిగి బ్లూటిక్లు వచ్చాయి. పైగా వారు ట్విటర్ బ్లూను సబ్స్క్రైబ్ చేసుకొని డబ్బులు చెల్లించారని టిక్పై క్లిక్ చేసినప్పుడు కనిపిస్తోంది. ఇలా బ్లూ టిక్ పొందిన వారిలో దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్, రిషి కపూర్, గాయకుడు మైకేల్ జాక్స్, బాస్కెట్బాల్ ఆటగాడు కోబే బ్రయంట్, క్రికెటర్ షేన్ వార్న్ వంటి ప్రముఖుల ఖాతాలు ఉన్నాయి. అయితే, ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సేకు ట్విటర్లో 6.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కానీ, ఆయన ఖాతాలో మాత్రం ఇప్పటికీ బ్లూ టిక్ కనిపించడం లేదు. కొంతమంది ట్విటర్ ఖాతాలను తానే వ్యక్తిగతంగా చెల్లించి ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ సేవలను అందిస్తున్నట్లు ఎలాన్ మస్క్ చెప్పారు.
Related News
KCR Entered Social Media: సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్..!
ఇప్పటివరకు సోషల్ మీడియా అకౌంట్ వాడని కేసీఆర్ తాజాగా ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చారు.