TTD: టీటీడీ ఉదయాస్తమ టికెట్ ధర కోటి రూపాయలు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఉదయాస్తమ సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది.
- By hashtagu Published Date - 04:11 PM, Sat - 18 December 21

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఉదయాస్తమ సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమ ఈ సేవా టికెట్ ధరను రూ. 1 కోటిగా నిర్ణయించగా… శుక్రవారం రోజున మాత్రం ఈ టికెట్ ధర రూ. 1.5 కోట్లుగా ఉంటుంది. ఉదయాస్తమ సేవ టికెట్ తీసుకున్న వారికి ఏడాదికి ఒక రోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ టికెట్ తో 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం భక్తులకు లభిస్తుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద 531 ఉదయాస్తమ టికెట్లు అందుబాటులో ఉన్నటు పేర్కొంది. ఈ టికెట్ల వల్ల టీటీడీకి దాదాపు రూ. 600 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ సేవా టికెట్ల వల్ల వచ్చే ఆదాయాన్ని చిన్న పిల్లల ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది.