TSRTC : కోఠి- కొండాపూర్ మధ్య “లేడీస్ స్పెషల్” బస్సు.. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఆర్టీసీ ఎండీ
కోఠి - కొండాపూర్ మధ్య 'లేడీస్ స్పెషల్' బస్సును ఆగస్టు 21 నుంచి ప్రారంభించనున్నట్లు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ
- By Prasad Published Date - 08:18 AM, Sat - 19 August 23
కోఠి – కొండాపూర్ మధ్య ‘లేడీస్ స్పెషల్’ బస్సును ఆగస్టు 21 నుంచి ప్రారంభించనున్నట్లు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్లో తెలిపారు. మహిళా ప్రయాణికులు ఈ సేవను ఉపయోగించుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు. బస్సు నెం. 127కె కోఠి నుంచి ఉదయం 8.50 గం.లకి ప్రారంభమై లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషాకిరణ్, బేగంపేట, కొత్తగూడ ఎక్స్ రోడ్ల మీదుగా కొండాపూర్ చేరుకుంటుందని ఆయన ట్విట్టర్లో తెలిపారు. సాయంత్రం 5.45 గంటలకు అదే మార్గంలో కోఠికి బస్సు తిరిగి వస్తుందని తెలిపారు.. మహిళా ప్రయాణికులు ఈ సేవను వినియోగించుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని టీఎస్ ఆర్టీసీ తెలిపింది.
మహిళా ప్రయాణికులకు శుభవార్త. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్,… pic.twitter.com/EhpJg85VUb
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) August 18, 2023
Related News
TSRTC: సార్వత్రిక ఎన్నికలకు ఆర్టీసీ సిద్ధం.. ఓటర్ల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు
TSRTC: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం #TSRTC యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ వైపునకు ఇప్పటివరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయగా.. తాజాగా హైదరాబాద్-విజయవాడ రూట్ లో 140 సర్వీసులను ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ కోసం పెట్టడం జరిగింది. ఆయా బస్సుల్లో దాదాపు ౩ వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. �