Tiger Hunt: ఆసిఫాబాద్ జిల్లాలో పులి హల్ చల్.. రెండు బర్రెలు మృతి
పులి దాడి చేసిన ఘటనలో రెండు బర్రెలు చనిపోయాయి. దీంతో గ్రామస్తులు భయపడిపోతున్నారు.
- By Balu J Published Date - 11:58 AM, Mon - 29 May 23
తెలంగాణలో పులుల (Tigers) సంచారం పెరిగిపోతోంది. ఫలితంగా పలు అటవీ ప్రాంతాల్లో పులుల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా కుమురంభీం ఆసిఫాబాద్లోని సిర్పూర్ మండలం చిల్పెల్లి, ఇటిక్ల్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో పెద్ద పులి పశువులను వేటాడింది. ఈ ఘటనలో రెండు గేదెలను చంపేసింది. దీంతో గ్రామస్తులు (Villagers) భయాందోళనకు గురయ్యారు.
అడవిలో రెండు గేదెలను గుర్తించిన అటవీ అధికారి (Forest Officer) వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. పులి సంచారాన్ని, గేదెలను చంపిన సంఘటన గురించి ప్రజలను అప్రమత్తం చేశాడు. ఈ ఘటనను సోషల్ మీడియా (Social Media) ద్వారా అవగాహన కల్పిస్తున్నాడు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు. ఒకవేళ పశువులను మేతకు తీసుకెళ్తే, కాపలాగా ఉంటూ అప్రమత్తగా ఉండాలని సూచించాడు.
Also Read: KTR Tweet: పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజే రెజర్లపై దాష్టీకం దురదృష్టకరం: కేటీఆర్
Related News
Peacocks Dead: రాజస్థాన్లో 50 నెమళ్లు మృతి
రాజస్థాన్లోని బికనీర్ జిల్లా మంకాసర్ గ్రామంలో దాదాపు 50 నెమళ్లు చనిపోయాయి. ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో జాతీయ పక్షి నెమళ్లు చనిపోవడంతో అటవీశాఖలో కలకలం రేగింది.