Telangana : తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజీల్లో త్వరలో ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం
తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చే విద్యాసంవత్సరానికి మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ తరగతులను
- By Prasad Published Date - 11:33 AM, Wed - 26 October 22
తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చే విద్యాసంవత్సరానికి మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ తరగతులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. నవంబర్లో తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) సిఫారసుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలపడంతో ఇప్పటికే కేటాయింపు ఉత్తర్వులు పొందిన వారు ఇంజినీరింగ్ కోర్సులకు పెంచిన ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. రాబోయే విద్యాసంవత్సరాలకు వర్తించే కొత్త ఫీజు నిర్మాణం ప్రకారం.. కనీస రుసుము రూ. 45000గా నిర్ణయించారు. తెలంగాణలోని 40 ఇంజినీరింగ్ కాలేజీలకు లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఫీజు నిర్ణయించారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజు పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తెలంగాణ ఎంసెంట్ 2022 చివరి దశ సీట్ల కేటాయింపును తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) అక్టోబర్ 26న విడుదల చేస్తుంది. అలాట్మెంట్లు పొందిన వారు, కేటాయించిన కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్ట్ చేసి ట్యూషన్ ఫీజు చెల్లించాలి. వారు తప్పనిసరిగా అక్టోబర్ 28, 2022లోపు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాలి. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అక్టోబర్ 27న జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం ఇంజినీరింగ్ కాలేజీలు ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తాయి. అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంజినీరింగ్ కాలేజీల్లో నవంబర్లో తరగతులు ప్రారంభమవుతాయి.
Tags
Related News
Hyderabad – June 2 : జూన్ 2 నుంచి తెలంగాణదే హైదరాబాద్.. సీఎం రేవంత్ కసరత్తు
ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను రేవంత్రెడ్డి ఆదేశించారు.