YS Sharmila: కేటీఆర్ కు షర్మిల సపోర్ట్.. ఆ వ్యాఖ్యలపై ఖండన!
బీజేపీ నేత తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూన్యూస్ కేటీఆర్ కుమారుడుని ఉద్దేశిస్తూ ఓ పోల్ పోస్ట్ చేసింది. దీనిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- By Balu J Published Date - 02:10 PM, Sat - 25 December 21
బీజేపీ నేత తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూన్యూస్ కేటీఆర్ కుమారుడుని ఉద్దేశిస్తూ ఓ పోల్ పోస్ట్ చేసింది. దీనిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి తెలంగాణలో మీ బీజేపీ నేతలకు నేర్పిస్తున్నది ఇదేనా? నా కుమారుడి శరీరాకృతిపై బీజేపీ ప్రచారకర్తలు అసహ్యమైన రాజకీయవ్యాఖ్యలు చేయడం సంస్కారమేనా? అంటూ మండిపడ్డారు. అయితే ప్రస్తుతం తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై పోల్ పెట్టడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేటీఆర్ కు మద్దతు తెలిపారు. ఈ మేరకు షర్మిల ఓ పోస్ట్ పెట్టారు. ‘ఒక తల్లిగా, ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా.. పిల్లలను వేధించడం, కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలు చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. మహిళలను కించపరచడం, పిల్లలను బాడీ షేమ్ చేయడం వంటి ప్రకటనలు చేయడాన్ని నేను ఖండిస్తున్నాను’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
As a mother I detest bullying kids&as a leader of a political party,I condemn such derogatory statements on the family members.Whether it is belittling women or bodyshaming kids, we must come together to call out such statements irrespective of our political affiliations @KTRTRS https://t.co/6L16jNYtcL
— YS Sharmila (@realyssharmila) December 25, 2021
Tags
Related News
TS : కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందిః కేటీఆర్
KTR: కాంగ్రెస్ పార్టీ(Congress Party)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల(Six guarantees) పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరు నెలల కాలంలోనే ప్రజలకు పూర్తిగా అర్థమయిపోయిందని చెప�