Supreme Slams: డిఫెన్స్ లాయర్ కి చీఫ్ జస్టిస్ వార్నింగ్
బెయిల్ మంజూరైన అత్యాచార నిందితుడికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
- By Siddartha Kallepelly Published Date - 12:20 PM, Tue - 12 April 22
బెయిల్ మంజూరైన అత్యాచార నిందితుడికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. హోర్డింగ్స్ పెట్టేవాళ్ళు ఆలోచన చేయాలని, అనాలోచితంగా పెట్టె హోర్డింగ్స్ తో వాటి విలువ దిగజారి పోతోందని తెలిపిన జస్టిస్ రమణ హోర్డింగ్స్ వల్ల మంచోడు, చెడ్డోడు ఒకే కోవలోకి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచార నిందితుడి కోసం భయ్యా ఈజ్ బ్యాక్ అంటూ ఏర్పాటు చేసిన హోర్డింగు పై స్పందిస్తూ మీ భయ్యాను జాగ్రత్తగా ఉండమనండని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ హోర్డింగ్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి బెయిల్ను రద్దు చేయాలంటూ బాధితురాలు సుప్రీంను ఆశ్రయించింది. విచారణ సందర్భంగా హోర్డింగు విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా….డిఫెన్స్ న్యాయవాదిని ఉద్దేశిస్తూ…. భయ్యా ఈజ్ బ్యాక్ అని హోర్డింగు పెట్టడమేంటి? అసలు దీని అర్థమేంటి? ఈ వారం మీ భయ్యాను జాగ్రత్తగా ఉండమని చెప్పండని సుప్రీం హెచ్చరించింది.
Related News
LS Polls: ఎన్నికల శిక్షణ తరగతులకు గైర్హాజరైన వారిపై క్రిమినల్ చర్యలు
LS Polls: పార్లమెంట్ ఎన్నికల విధులు కోసం నియమించబడిన అధికారులు శిక్షణ తరగతులకు గైర్హాజరైన 30 మంది పై జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ కొరడా ఝులిపించారు. శిక్షణ తరగతులకు గైర్హాజరు అయిన సిబ్బందిపై ఆర్ పి యాక్ట్ 1951 సెక్షన్ 134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. కాగా లోక్ సభ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమిం�