HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Police Resort To Lathi Charge On Bjp Workers In Marriguda

Munugode Bypoll: మునుగోడులో హైటెన్షన్.. పోలింగ్ బూత్ ల వద్ద 144 సెక్షన్!

మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడలో పోలింగ్ రోజున మర్రిగూడలో పలువురు స్థానికేతర టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఉన్నారని ఆరోపిస్తూ

  • By Balu J Published Date - 10:57 AM, Thu - 3 November 22
  • daily-hunt
Munugode P[olling Thumb Cop
Munugode P[olling Thumb Cop

మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడలో పోలింగ్ రోజున మర్రిగూడలో పలువురు స్థానికేతర టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఉన్నారని ఆరోపిస్తూ గుంపులుగా గుమిగూడిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. అన్ని పోలింగ్ బూత్‌ల చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉంది.  పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా గుమిగూడడం నిషేధించబడింది. ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. మునుగోడులో టీఆర్ ఎస్ స్థానికేతరులు ఎందుకు మకాం వేస్తున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటును  వినియోగించుకున్నారు. రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో పలువురు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రౌడీలు మకాం వేసి ఉంటున్నారని ఆరోపించారు. బుధవారం రాత్రి పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఓటర్లను బెదిరించి ఓటర్లకు డబ్బులు పంచే వరకు వెళ్లారని ఆరోపించారు. పోలింగ్ ఏజెంట్లను సైతం టీఆర్‌ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు.

మునుగోడు ఓటర్లు ఎలాంటి బెదిరింపులకు భయపడరని, ఆఫర్లకు ఆకర్షితులు కావొద్దని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈసీకి, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. కాగా మునుగోడు నియోజకవర్గం, నారాయణపూర్ మండలంలోని తన స్వగ్రామమైన లింగవారిగూడెంలో ఓటు హక్కు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వినియోగించుకున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Munugode
  • Munugode police
  • TRS and BJP

Related News

    Latest News

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd