Al Hakim Mosque : ఈజిప్ట్ మసీదును సందర్శించనున్న ప్రధాని మోడీ
Al Hakim Mosque : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 24, 25 తేదీల్లో ఈజిప్ట్లో పర్యటించనున్నారు.
- By Pasha Published Date - 03:48 PM, Mon - 19 June 23

Al Hakim Mosque : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 24, 25 తేదీల్లో ఈజిప్ట్లో పర్యటించనున్నారు. 2023 జనవరిలో ఢిల్లీలో భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్సీసీ.. మోడీని కలిసి తమ దేశానికి రావాలని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు ఈజిప్టుకు వెళ్తున్న మోడీ.. ఓల్డ్ కైరోలోని చారిత్రక అల్ హకీమ్ మసీదును సందర్శించనున్నారు. ఈ మసీదుకు దాదాపు 1,000 సంవత్సరాల చరిత్ర ఉంది.
Also read : Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం
దావూదీ బోహ్రా కమ్యూనిటీ సహాయంతో గత ఆరేళ్ళ వ్యవధిలో(2017-2023) అల్ హకీమ్ మసీదు(Al Hakim Mosque) పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు. ఆరో ఫాతిమిద్ ఖలీఫ్ పేరును ఈ మసీదుకు పెట్టారు. కైరో సిటీ నడిబొడ్డున ఇది ఉంది. భారత్ లో ఉన్న దావూదీ బోహ్రా కమ్యూనిటీ ఈ మసీదు పునరుద్ధరణకు సహకరించింది. అల్-హకీమ్ మసీదు సందర్శన సందర్భంగా ప్రధాని మోడీ వెంట, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా కూడా ఉంటారని భావిస్తున్నారు. 2015లో అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు, 2018లో ఇండోనేషియాలోని గ్రాండ్ ఇస్తిఖ్లాల్ మసీదులను కూడా మోడీ సందర్శించారు.