PM Modi: నరేంద్ర మోడీని ఆకట్టుకున్న జపాన్ రాయబారి ట్వీట్.. ట్వీట్ లో ఏముందో తెలుసా?
జపాన్ రాయబారి హిరోషి సుజుకి దంపతులు భారత దేశ రుచులను ఆస్వాదిస్తున్న తీరు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆకర్షించింది. ప్రధాని నియోజకవర్గమైన వ
- By Nakshatra Published Date - 08:20 PM, Sun - 11 June 23
జపాన్ రాయబారి హిరోషి సుజుకి దంపతులు భారత దేశ రుచులను ఆస్వాదిస్తున్న తీరు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆకర్షించింది. ప్రధాని నియోజకవర్గమైన వారణాసిలో గత నెల హిరోషి దంపతులు బనారసీ చాట్, తాలి ఆరగించిన చిత్రాలను ట్విటర్ లో షేర్ చేశారు. ఈ సారి హిరోషి దంపతులు ముంబైలో వడాపావ్ ను రుచి చూశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆ దంపతులు స్ట్రీట్ఫుడ్ అన్వేషణలో భాగంగా కొల్హాపురి వంటకాలను రుచి చూశారు. ఇవి కొంచె కారం ఎక్కువగానే ఉంటాయి. కానీ, హిరోషి సతీమణి ఇవేవీ పట్టించుకోకుండా ఆ రుచులను ఎంతో బాగా ఆస్వాదించారు.
ఆ ఫుడ్ ని తింటున్నా వీడియోని హిరోషి తన ట్విటర్లో షేర్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఈ విధంగా క్యాప్షన్ ని కూడా రాసుకోచ్చారు. నా భార్య నన్ను ఓడించింది అని ఆయన క్యాప్షన్ జోడించారు. ఆ వీడియోలో ఆయన పుణేలో కొల్హాపురి రుచులను వారు రుచిచూస్తున్నారు. హిరోషి కొంచె తక్కువ కారం కోరుకుంటే ఆయన సతీమణి మాత్రం కొల్హాపురి రేంజిలో స్పైసీగా ఉండాలని డిమాండ్ చేశారు. వారు మిసల్పావ్, సబుదాన అనగా సగ్గుబియ్యం వడలను రుచి చూశారు. వారు కయానీ బేకరీ, ఇరానీ కేఫ్ వంటి ప్రముఖ ఆహార శాలలను సైతం సందర్శించారు.
This is one contest you may not mind losing, Mr. Ambassador. Good to see you enjoying India’s culinary diversity and also presenting it in such an innovative manner. Keep the videos coming! https://t.co/TSwXqH1BYJ
— Narendra Modi (@narendramodi) June 11, 2023
అయితే వారు చేసిన ట్వీట్ ప్రధానిని బాగా ఆకర్షించింది. వీడియో పై ప్రధాని స్పందిస్తూ.. మిస్టర్ అంబాసిడర్. మీరు ఓడిపోయినా పట్టించుకోని పోటీ ఇది. మీరు భారత్లోని ఆహార వైవిధ్యాన్ని ఆస్వాదించడం.. దానిని వినూత్నంగా ప్రజెంట్ చేయడం చూడటానికి చాలా బాగుంది. వీడియోస్ను కొనసాగించండి అని రాసుకొచ్చారు నరేంద్ర మోడీ.
Related News
PM Modi: జరిగిన విధ్వంసాన్ని శత్రువుకు ముందే చెప్పాం..బాలాకోట్ దాడిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
Balakot Strikes: పాకిస్థాన్(Pakistan) ఆక్రమిత భూభాగంలోని బాలాకోట్(Balakot)లో భారత వైమానిక దళం జరిపిన దాడులు సంచలనం సృషించిన విషయం తెలిసిందే. గత 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ దాడుల పై ప్రధాని మోడీ(Pm Modi) తాజాగా కీలక విషయాలను వెల్లడించారు. బాలాకోట్పై వైమానిక దాడుల గురించి పాకిస్థాన్కు సమాచారం ఇచ్చిన తర్వాతే మీడియాకు వెల్లడించామన్నారు. We’re now on WhatsApp. Click to Join. కర్ణాటకలోని బగల్కోట్ ఎన్ని