Selfie: దున్నపోతుతో సెల్ఫీ తీసుకునేందుకు జనం క్యూ.. ఎందుకంటే..?
- By Nakshatra Published Date - 11:03 PM, Fri - 7 April 23
Selfie: దున్నపోతుతో సెల్పీ తీసుకునేందుకు జనం ఎగబడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే.. ఉత్తరప్రదేశ్ లో ఈ సంఘటన జరిగింది. ముజఫర్నగర్లో ఇటీవల పశువుల సంత జరిగింది. ఈ సంతకు యూపీతో పాటు నాలుగు రాష్ట్రాల నుంచి పశువులు వచ్చాయి. అయితే ఈ సంతకు ఓ దున్నపోతును తీసుకొచ్చారు. ప్రత్యేక జాతికి చెందిన ఈ దున్నపోతు ధర రూ.10 కోట్లు పలుకుతుందట.
ముర్రా జాతికి చెందిన ఈ దున్నపోతులు చాలా అరుదుగా ఉంటాయి. దీంతో దీనితో సెల్పీలు తీసుకునేందుకు జనం క్యూ కట్టారు. ప్రజలు ఎగబడి ఫొటోలు తీసుకున్నారు. బాహుబలి సినిమాలోని ఉండే ఎద్దుకి ఏ మాత్రం తీసిపోన్నట్లు ఈ దున్నపోతు కనిపిస్తోంది. దాదాపు ఈ దున్నపోతు 16 క్వింటాళ్లు ఉంటుంది. హర్యానాలోని పానిపట్ నుంచి యూపీలోని సంతకు దీనిని తీసుకొచ్చారు. పానిపట్ లోని దిద్వాడి గ్రామానికి చెందిన నరేందర్ సింగ్ అనే వ్యక్తి దీనిని తీసుకొచ్చాడు.
గతంలో ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఈ దున్నపోతుకు ఫోలు అనే పేరు పెట్టారు. రోజుకు 10 కిలోల మేత ఇది తింటుందట. దీనికి ఇచ్చే ఆహారంతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు యజమాని నరేంద్ర సింగ్ చెబుతున్నారు. దీని ధర రూ.10 కోట్లు పలుకుతుందని, అందుకే ఇది చాలా స్పెషల్ అని అంటున్నాడు. దీనితో సెల్పీలు దిగేందుకు చాలామంది ఎగబడుతున్నట్లు చెబుతున్నాడు.దేశంలో ఇలాంటి జాతికి చెందిన దున్నపోతులు చాలా అరుదుగా ఉన్నాయని, అందుకే ఈ దున్నపోతులు మంచి డిమాండ్ ఏర్పడిందని అంటున్నాడు. ఇది విని చాలామంది వామ్మో దున్నపోతుకు కూడా ఇంత ధర ఉంటుందా అంటూ కామెంట్ చేస్తున్నారు.
Tags
Related News
Modi Selfie: యువ రైతు కోరిక మేరకు సెల్ఫీ ఇచ్చిన మోడీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శ్రీనగర్లో పర్యటించారు. బక్షి స్టేడియంలో రూ.6400 కోట్లతో 53 అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని కాశ్మీర్కు వెళ్లడం ఇదే తొలిసారి