Revanth: ‘ముందస్తు’ ఎన్నికల మర్మమిదే!
తెలంగాణలో రాజకీయాలు కాకమీదున్నాయి. రేపో, ఎల్లుండో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం అన్నట్టుగా రాజకీయ వాతావరణం మారిపోయింది.
- By Hashtag U Published Date - 01:05 PM, Sun - 6 March 22
తెలంగాణలో రాజకీయాలు కాకమీదున్నాయి. రేపో, ఎల్లుండో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం అన్నట్టుగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఎందుకంటే అన్ని పార్టీలు ఇదే రీతిలో హడావుడి చేస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల పాదయాత్రలు, ఇటు బీజేపీలో క్షేత్రస్థాయిలో ప్రచారాలు జోరుగా ఉన్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ.. గత కొద్ది రోజులుగా సందడిగా కనిపిస్తోంది. అంటే ఇవన్నీ ముందస్తు ఎన్నికల సంకేతాలా? మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎందుకలా అన్నారు?
సీఎం కేసీఆర్ ఈమధ్య దేశ రాజకీయాల మీదే మాట్లాడుతున్నారు. గ్రౌండ్ లెవల్లో ప్రజలకు చేరువవుతూనే బహిరంగ సభలు పెట్టారు. తరువాత జాతీయస్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రాల హక్కులు కేంద్రం లాక్కోవడం, రాజ్యాంగం మార్పు వంటి అంశాలపై పోరాడుతున్నారు. అవినీతి చిట్టా వెలుగుచూస్తుందనే.. కేసీర్ ఇదంతా చేస్తున్నారని.. రోజుకో నాటకమాడుతున్నారని ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ రద్దయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు రేవంత్ రెడ్డి. మార్చిలో ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పారు.
ఢిల్లీలో ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిని కలిసిన తరువాత కేసీఆర్ స్వరం మారిందా? ఆయన కేసీఆర్ దోపీడి గురించి లెక్క చెప్పడం వల్లే మాట మార్చారంటూ ఆరోపించారు రేవంత్ రెడ్డి. అందుకే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను కలిసిన తరువాత బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి ఫ్రంట్ పెట్టట్లేదని కేసీఆర్ చెప్పారన్నారు. ప్రధాని మోదీ సంగతి చూస్తా.. అధికారం నుంచి దించేవరకు నిద్రపోనన్న కేసీఆర్.. ఇప్పుడెందుకు మాట మార్చారంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ వి ఊహాగానాలా కాదా అన్నది పక్కనపెడితే.. కేసీఆర్ గతంలోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దానిని ప్రతిపక్షాలు అస్సలు ఊహించలేదు. ఇప్పుడు కూడా అలాగే చేసి లబ్ది పొందే యోచనలో ఉంటారేమోనని.. ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నాయి.
Related News
TS : హరీశ్ రావు-రేవంత్ రెడ్డిల విద్యుత్ కోతల వివాదం
Power cuts controversy:మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ కోతల(Power cuts) విషయంతో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పై విమర్శలు గుప్పించారు. అందరూ తనలాగే కుట్రలు, కుతంత్రాలు పన్నుతారనే భ్రమల్లోనే రేవంత్ రెడ్డి ఉన్నారని కానీ అలాంటి ఆలోచనలు మానుకొని ముఖ్యమంత్రి పాలనపై దృష్టి సారించాలని అన్నారు. విద్యుత్ కోతల విషయంలో ప్రభుత్వ ఉద్యోగ