India: ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లును పార్లమెంటు లో ప్రవేశపెట్టిన కేంద్రం
ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లు 2021ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఓటరు కార్డును ఆధార్ తో లింక్ చేయాలనే నిబంధన ఈ బిల్లులో ఉంది.
- By hashtagu Published Date - 02:55 PM, Mon - 20 December 21

ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లు 2021ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఓటరు కార్డును ఆధార్ తో లింక్ చేయాలనే నిబంధన ఈ బిల్లులో ఉంది. ఎన్నికల్లో ఒక వ్యక్తి పలు ప్రాంతాల్లో ఓటర్ గా నమోదు చేసుకొని రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని ఈ సవరణతో అలంటి దొంగ ఓటర్లను కట్టడి చేయవచ్చని మంత్రి అన్నారు. సదరు వ్యక్తికి ఆధార్ కార్డు లేని పక్షం లో ఇతర ఐడి ప్రూఫ్ తో నమోదు చేసుకునే వెసులుబాటును కూడా ఈ బిల్లులో చేర్చారు.