Opposition Meet Postponed : విపక్షాల మీటింగ్ వాయిదా.. పార్లమెంటు సమావేశాల తర్వాతే భేటీ
Opposition Meet Postponed : ప్రతిపక్ష పార్టీల సమావేశం వాయిదా పడింది.
- By Pasha Published Date - 10:07 AM, Mon - 3 July 23
Opposition Meet Postponed : ప్రతిపక్ష పార్టీల సమావేశం వాయిదా పడింది. బెంగళూరు వేదికగా జూలై 13 నుంచి 14 వరకు జరగాల్సిన విపక్ష పార్టీల సమావేశాన్ని వాయిదా వేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తర్వాత ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగుతుందని, ఆ తర్వాత తేదీని ప్రకటిస్తామని జేడీ(యూ) నాయకుడు కేసీ త్యాగి వెల్లడించారు. బీహార్, కర్ణాటక అసెంబ్లీల వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్ సమావేశాల కారణంగా మీటింగ్ ను వాయిదా వేశామని చెప్పారు.
Also read : Drone Flying-Pm Modis House : ప్రధాని మోడీ నివాసంపై గుర్తు తెలియని డ్రోన్ చక్కర్లు?
బీహార్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జూలై 10-24 తేదీల్లో జరగనున్నాయి. నితీష్ కుమార్ పార్టీ జేడీయూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విజ్ఞప్తి మేరకు ఈ సమావేశాన్ని(Opposition Meet Postponed) వాయిదా వేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి.
Tags
Related News
PM Modi: ఈడీ, సీబీఐలను ఎవ్వరూ ఆపలేరు: మోడీ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు సంస్థలు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయని , వాటిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.