Ukraine Medicos: గుడ్ న్యూస్.. ఉక్రెయిన్ వైద్య విద్యార్థుల ఇంటర్న్ షిప్ నకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్
ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్యవిద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇప్పటివరకు ఓ టెన్షన్ ఉండేది. ఆ దేశంలో యుద్ధ పరిస్థితుల వల్ల చదువులు ఏమైపోతాయో అని వారు బెంగపడ్డారు.
- By Hashtag U Published Date - 08:44 AM, Sat - 5 March 22
ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్యవిద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇప్పటివరకు ఓ టెన్షన్ ఉండేది. ఆ దేశంలో యుద్ధ పరిస్థితుల వల్ల చదువులు ఏమైపోతాయో అని వారు బెంగపడ్డారు. కానీ జాతీయ వైద్య కమిషన్ వారికి గుడ్ న్యూస్ చెప్పింది. మానవీయ కోణంలో మెడికల్ స్టూడెంట్స్ కు న్యాయం చేయాలని కేంద్రం కూడా ఆలోచిస్తోంది. అందుకే నిబంధనలు మార్చడానికి కసరత్తు చేస్తోంది.
ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ డిగ్రీ కాల వ్యవధి ఆరేళ్లు. అది పూర్తయ్యాక రెండేళ్లపాటు అక్కడే ఇంటర్న్ షిప్ చేయల్సి ఉంటుంది. మన దేశంలోని జాతీయ వైద్య కమిషన్ రూల్స్ ప్రకారం.. విదేశాల్లో మెడికల్ డిగ్రీ అందుకున్నవారు.. అక్కడే ఇంటర్న్ షిప్ కూడా పూర్తిచేయాలి. మన దేశంలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేయడానికి మళ్లీ ఓ పరీక్ష పాసవ్వాలి. అది.. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష. దీనినే ఎఫ్ఎంజీఈ అంటారు. దీనిని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది.
ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మెడికల్ స్టూడెంట్స్ కు ప్రైవేటు కాలేజీల్లో వారి చదువును పూర్తి చేసుకునే అకాశం ఇస్తారు. ఎఫ్ఎంజీఈ పరీక్ష పాస్ అయినవారే ఇంటర్న్ షిప్ చేయడానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వీళ్ల రిజిస్ట్రేషన్ కు సంబంధించి స్టేట్ మెడికల్ కౌన్సిళ్లకు పర్మిషన్ కూడా ఇచ్చింది. కాకపోతే దీనికి కొన్ని నిబంధనలు విధించించింది. అక్కడ ఎంబీబీఎస్ చదివినవారు దాని ఇంటర్న్ షిప్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారా లేదా అన్నది చెక్ చేస్తారు.
ఇలా ఇంటర్న్ షిప్ చేసేవారి నుంచి ఎలాంటి ఫీజులూ వసూలు చేయకూడదు. దీనికి సంబంధించి అన్ని మెడికల్ కాలేజీల నుంచి స్టేట్ మెడికల్ కౌన్సిళ్లు ముందే హామీ తీసుకోవాలి. మన దేశంలో మెడికల్ కోర్సు చేస్తున్నవారికి ఎలాంటి సౌకర్యాలు, స్టైఫండ్ అందిస్తారో.. ఉక్రెయిన్ లో చదివిన మనవారికీ అలాంటి సదుపాయాలే కల్పిస్తారు. ఏదేమైనా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Tags
Related News
MBBS Pass Marks : ఎంబీబీఎస్ పాస్ మార్కులపై ఎన్ఎంసీ వెనకడుగు.. పాత విధానానికే జై
MBBS Pass Marks : నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది.