Terrible : ముగ్గురు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి..!!
భర్తతో గొడవపడిని ఓ మహిళ..తన ముగ్గురు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది.
- By hashtagu Published Date - 05:24 PM, Mon - 10 October 22

భర్తతో గొడవపడిని ఓ మహిళ..తన ముగ్గురు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. కైమూర్ జిల్లాలోని భగవాన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పటేరియా గ్రామానికి చెందిన రంకీ దేవి…అజయ్ భార్యభర్తలు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దంపతుల మధ్య రెండు రోజుల క్రితం ఘర్షణ జరిగింది. మనస్థాపం చెందిన రంకీదేవి…ముగ్గురు పిల్లలను బావిలోకి తోసేసి తర్వాత ఆమె కూడా దూకి సూసైడ్ చేసుకుంది. బావిలో చెప్పులు తేలుతుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బావిలో నుంచి శవాలను బయటకు తీశారు పోలీసులు. మృతురాలి భర్తను అరెస్టు చేశారు.
-IANS…