Kavitha Bail : రేపు హైదరాబాద్కు ఎమ్మెల్సీ కవిత..
ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత కవిత తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే ఈరోజు రాత్రికి ఆమె ఢిల్లీలోనే బస చేయనున్నారు
- Author : Sudheer
Date : 27-08-2024 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Scam Case)లో ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్ట్ బెయిల్ (Kavitha Bail) మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Case)లో ఈడీ అధికారులు కవిత(BRS MLC Kavitha)ను మార్చి 15న అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి దాదాపు 5 నెలలకు పైగా ఆమె తిహాడ్ జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం ఎంతగానో ట్రై చేసిన కుదరకపోవడం తో సుప్రీం కోర్ట్ (Supreme Court) ను ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్పై మంగళవారం సుప్రీం కోర్ట్ లో విచారణ విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. కవిత తరుఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత కవిత తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే ఈరోజు రాత్రికి ఆమె ఢిల్లీలోనే బస చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ కుమార్, కేటీఆర్, హరీష్ రావు రానున్నారు. ఇక రేపు ఉదయం బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటె..కవిత కు బెయిల్ వచ్చిన క్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్స్ పంచుకుంటూ న్యాయం గెలిచిందంటూ వారంతా చెపుతున్నారు.
Read Also : Praja Palana : సెప్టెంబరు 17 నుంచి ‘ప్రజా పాలన’.. అర్హులందరికీ హెల్త్ కార్డులు : సీఎం రేవంత్