Puvvada: యాదాద్రి ఆలయానికి కేజీ బంగారం విరాళం!
శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మంత్రి కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు.
- By Balu J Published Date - 09:03 PM, Tue - 19 April 22
యాదాద్రిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. మంత్రి తన జన్మదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని విమాన గోపురానికి ఖమ్మం ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున 1కేజీ బంగారం, పట్టువస్త్రాలను కలెక్టర్ పమేలా సమక్షంలో అజయ్కుమార్ ఈఓ గీతకు అందజేశారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం మంత్రి, కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు ఆహ్వానించారు. అనంతరం పువ్వాడ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. ఆలయానికి కేజీ బంగారం అందించినందుకుగానూ ప్రత్యేకంగా సన్మానించారు.
Related News
KTR: మోడీ తరహాలో కేసీఆర్ మత రాజకీయాలు ఏనాడూ చేయలేదు: కేటీఆర్
వచ్చే లోక్సభ ఎన్నికల్లో మతతత్వ పార్టీ బీజేపీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ కోసం బీజేపీ చేసిందేమీ లేదని అన్నారు. బుధవారం మేడ్చల్ నియోజకవర్గం మేడిపల్లిలో జరిగిన కేడర్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ