Minister KTR : సాయిరెడ్డి సమావేశంలో కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటి సమావేశం జరిగింది.
- By CS Rao Published Date - 01:59 PM, Mon - 18 April 22
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటి సమావేశం జరిగింది. ఈ పార్లమెంట్ సమావేశం స్టాండింగ్ కమిటి ఛైర్మన్, వైసీపీ నేత, రాజసభ సభ్యులు విజయ సాయి రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ నేపథ్యలోనే… మెంబర్స్ ఆఫ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కామర్స్ మెంబర్స్ అందరూ ఈ సమావేశానికి హాజరు అయ్యారు. అయితే, కమిటి మెంబర్స్ తొమ్మిది మంది ఎంపీలు హాజరు కాలేకపోయారు. అటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఐటి, కామర్స్ ఇండస్ట్రీస్ మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేష్ కుమార్, జయేష్ రంజన్, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహచార్యులు హజరు అయ్యారు.టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, ఫిక్కి, డిక్కి.. ఎస్బీఐ, ఫార్మరంగ ప్రతినిధులు కూడా హాజరు అయ్యారు. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల అంశాలు, అభివృద్ధి పనులు, ఇతర కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
Related News
AP : విజయసాయిరెడ్డికి షర్మిల ప్రశ్నల వర్షం..సమాధానం చెపుతారా..?
ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల (Sharmila)..ఆ తర్వాత అధికార పార్టీ వైసీపీ (YCP) కి చెమటలు పట్టిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే..మరోపక్క అన్న జగన్ (Jagan) ఫై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి (Vijay Sai reddy)కి షర్మిల ప్రశ్నల వర్షం సంధించింది. తాజాగా సీఎం జగన్ ఆధ్వర్యంలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తమ ముందుకు వచ్చిన �