KCR Vs Tamilisai : గవర్నర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నితెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు
- By Siddartha Kallepelly Published Date - 01:16 PM, Fri - 8 April 22
నితెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. నేను తలచుకుంటే అసెంబ్లీ రద్దు అయ్యేది అనే విధంగా తన పరిధి దాటి వ్యాఖ్యలు చేశారని, ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తులు అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాటి గవర్నర్ రాంలాల్ కూలదోసిన తర్వాత ఎలాంటి ప్రజాగ్రాహాన్ని చవిచూశారో మనందరికీ తెలిసిందేనన్నారు. గతంలో గవర్నర్ గా ఉన్న నరసింహాన్ గౌరవప్రదంగా వ్యవహరించారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన్ను అంతే గౌరవించిందని పేర్కొన్నారు. గవర్నర్ తమిళసై తన గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రోటోకాల్ పాటించలేదని చెప్పడం అర్ధరహితమని, ఎక్కడ ఎవరు ఎలా అవమానించారో చెప్పాలన్నారు. యదాద్రి పర్యటనకు 20 నిమిషాల ముందే రాజ్ భవన్ నుంచి సమాచారం అందిందని, అయినప్పటికీ యదగిరిగుట్ట చైర్మన్ గవర్నర్ తమిళసైకి స్వాగతం పలికారన్నారు. గతంలో బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలుగా పని చేసిన తమిళిసై బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు.
Related News
Indrakaran Reddy : కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..?
కాంగ్రెస్ పార్టీ (Congress Party)లోకి వలసల పర్వం ఆగడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాగైతే బిఆర్ఎస్ (BRS) నుండి పెద్ద ఎత్తున నేతలు వచ్చి చేరారో..ఇప్పుడు లోక్ సభ ఎన్నికల తరుణంలో కూడా అలాగే నడుస్తుంది. బిఆర్ఎస్ పదేళ్ల పాలన లో కీలక పదవులు అనుభవించి..కేసీఆర్ (KCR) కు దగ్గర గా ఉన్న నేతలంతా ఇప్పుడు రేవంత్ దగ్గరికి వస్తున్నారు. అలాగే పలువురు నేతలు బిజెపి లోకి కూడా వెళ్లడం జరిగింది. రీసెంట్ గా మా�