Medaram: నేటి నుంచే మేడారం స్పెషల్ బస్సులు షురూ..!
- By Balu J Published Date - 02:57 PM, Tue - 11 January 22
మేడారం భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు నేటి (మంగళవారం) నుంచి హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జానర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుందని ఆయన వెల్లడించారు. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి చార్జీలు పెద్దలు రూ. 125, పిల్లలకు రూ. 65చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం MGBS నుంచి కూడా మేడారం కు స్పెషల్ బస్సులు నడపనున్నట్టు, భక్తులు https://tsrtconline.in లేదా #TSRTC App నందు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు ఆయన వెల్లడించారు.
ప్రజల సౌకర్యార్థం #MGBS నుండి మేడారం కు స్పెషల్ బస్సులు పెట్టడం జరిగింది https://t.co/EE9pOiiegh Website మరియు #TSRTC App నందు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు #TSRTCMedaramSpecial @TSRTCHQ @puvvada_ajay @Govardhan_MLA @TV9Telugu @sakshinews @eenadulivenews @bbcnewstelugu @Postfity pic.twitter.com/U0cfcNLYF9
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 11, 2022
Tags
Related News
Mahashivratri: మహా శివరాత్రి..వేములవాడ వెళ్లే భక్తులకు శుభవార్త
Mahashivratri: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. ఆ పర్వదినాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు బారులు తీరుతారు. తెలంగాణలోని శైవక్షేత్రాల్లో వేములవాడ (vemulawada) రాజన్న ఆలయం ఒకటి. మహాశివరాత్రి(Mahashivratri) పర్వదినం పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భక్తులు ఈ ఆలయానికి పొటెత్తుతారు. ఈ నేపథ్యంలో ఈనెల 8న మహా శివరాత్ర�