Manipur: అక్రమ వలసదారులను గుర్తించడం కోసం అలాంటి నిర్ణయం తీసుకున్న మణిపూర్ ప్రభుత్వం?
మణిపుర్ లో శాంతి చర్యలు నెలకొల్పేందుకు అధికారులు దిద్దు పాటి చర్యలను ప్రారంభించారు. ఇందులో భాగంగానే మయన్మార్ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి ప
- By Anshu Published Date - 04:13 PM, Sun - 30 July 23

మణిపుర్ లో శాంతి చర్యలు నెలకొల్పేందుకు అధికారులు దిద్దు పాటి చర్యలను ప్రారంభించారు. ఇందులో భాగంగానే మయన్మార్ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించిన వారిని గుర్తించే ప్రక్రియను చేపట్టారు. ఇందుకోసం మణిపుర్ ప్రజల నుంచి బయోమెట్రిక్ డేటాను సేకరిస్తున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. కాగా మయన్మార్ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించి.. ఇక్కడే ఉంటున్న వారిని గుర్తించేందుకు బయోమెట్రిక్ డేటా సేకరణ ప్రారంభించాము. ఈ ప్రక్రియ సెప్టెంబరు చివరి నాటికి పూర్తి చేస్తాము. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి డేటా సేకరించేందుకు జాతీయ నేరాల నమోదు సంస్థ నుంచి మణిపుర్కు ప్రత్యేక బృందాలు వచ్చాయి అని మణిపుర్ హోంశాఖ జాయింట్ సెక్రటరీ పీటర్ సలామ్ వెల్లడించారు.
మణిపుర్లో హింసకు మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థులతోపాటు, నార్కో టెర్రరిజమ్ కూడా కారణమని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే మయన్మార్ నుంచి మణిపుర్కు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న వ్యక్తులను రెండు నెలల క్రితం ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. గత వారం, రెండు రోజుల వ్యవధిలో సుమారు 700 మంది సరైన ప్రయాణ పత్రాలు లేకుండా మయన్మార్ నుంచి మణిపుర్లోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముందుగా అక్రమ వలసదారులను గుర్తించి వారిని తిరిగి మయన్మార్కు పంపేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు కల్లోలిత మణిపుర్లో ఇండియా కూటమి నేతలు పర్యటించారు. బాధిత కుంటుంబాలను పరామర్శించారు. దేశంలోని అన్ని పార్టీలు కలిసి మణిపుర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని కూటమి నేతలు అభిప్రాయపడ్డారు. గవర్నర్ను కలిసిన ఇండియా నేతలుమణిపుర్లో పర్యటిస్తున్న ఇండియా కూటమి నేతలు ఆదివారం ఉదయం గవర్నర్ అనుసూయ ఉకేను కలిశారు. ఇంఫాల్లోని రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయిన 21 మంది ఎంపీలు మెమోరాండం సమర్పించారు. మణిపుర్లో శాంతి పునరుద్ధరించాలని గవర్నర్కు విజ్ఞప్తి చే