Telangana Cabinet Meet: బడ్జెట్ రూపకల్పనపై ‘కేబినెట్‘ కీలక నిర్ణయాలు!
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ కి ఆమోద ముద్ర వేసారు.
- By Siddartha Kallepelly Published Date - 06:58 PM, Sun - 6 March 22
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ కి ఆమోద ముద్ర వేసారు. ఉద్యోగ నోటిఫికేషన్స్, పేదలకు ఇల్లు, మన ఊరు మన బడి, తో పాటు పలు సంక్షేమ పథకాలకు సంబందించిన విషయాలు కేబినెట్లో చర్చకు వచ్చాయి.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపధ్యంలో ఏయే శాఖలకు నిధులు కేటాయించాలన్న దానిపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన పూర్తి చేసింది. గత బడ్జెట్ కంటే ఎక్కువ కేటాయింపులు ఉండనున్నవనిఅధికార ప్రభుత్వ వర్గాల సమాచారం. కరోనా నుంచి కొలుకున్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతున్న క్రమంలో బడ్జెట్ అంచనాలు భారీగా ఉండనున్నవి. వ్యవసాయం సంక్షేమం,పెరిగిన జీత భత్యాలతో పాటు దళిత బంధు లాంటి పథకాల భారీగా నిధులు కేటాయించినట్లు తెలుస్తుంది.
రాష్ట్రంలో దళిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించే దళిత బంధు స్కీమ్ బడ్జెట్లో ప్రాధాన్యత గా తీసుకుంది. ఈ పధకం కోసం ప్రతి ఏటా బడ్జెట్ లో 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలను పెడుతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు గ్రాంట్స్ ప్రత్యేక సహాయం వంటి పూర్తి వివరాలను పరిగణనలోకి తీసుకొని బడ్జెట్ రూపకల్పన చేసినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది ఆర్థిక బడ్జెట్ 2 లక్షల 50 వేల వరకు ఉండొచ్చని అధికారుల అంచనా.
రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వంవచ్చాక ఉద్యోగాల భర్తీ చేయలేదన్న ఆగ్రహంతో నిరుద్యోగులు, విద్యార్థులు మండిపడుతున్నారు. ప్రతి పక్షాలు సైతం ఈ అంశం పై ఫోకస్ పెట్టాయి. ఈ బడ్జెట్ సమావేశాలలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలలో ఉద్యోగాల భర్తీ పై సర్కార్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దాదాపు 60 వేల ఖాళీలను భర్తీ కి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. డబుల్ బెడ్ రూమ్ పథకం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆమలుకు నోచుకోలేదు. ఈ విషయంలో ప్రభుత్వం పై చాలా విమర్శలున్నాయి. దీనితో సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షలు ఇవ్వడానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన పెంక్షన్స్ ఇవ్వనుంది ప్రభుత్వం దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, సంక్షేమ రంగానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా మన ఊరు మన బడి కార్యక్రమకి స్వీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 8 న ప్రారంభించనున్నారు. దీని కోసం గత కేబినెట్ సమావేశం లో నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో 7200 కోట్ల రూపాయల నిధులకు ఆమోద ముద్ర వేసింది. రైతుల కోసం మరో పధకం ప్రవేశపెట్టడానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. 57సంవత్సరాలకు పైబడిన రైతులకు ప్రభుత్వం ఇన్సురెన్స్ ఇచ్చే నూతన పధకానికి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టనున్నారు.
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
— Telangana CMO (@TelanganaCMO) March 6, 2022
Tags
Related News
Telangana CM Office: తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీస్ గా MCRHRD
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి పరంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అధికార యంత్రాంగాన్ని క్రమబద్ధీకరించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు.