Janasena : నేడు కడప జిల్లాకు జనసేనాని… సిద్ధవటంలో రచ్చబండ నిర్వహించనున్న పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు
- By Prasad Published Date - 10:27 AM, Sat - 20 August 22
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచే ఉద్దేశంతో కౌలు రైతుల భరోసా యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా నేడు (శనివారం) పవన్ కల్యాణ్ ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని సిద్ధవటం గ్రామంలో పవన్ కల్యాణ్ రచ్చబండ పేరిట రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. రచ్చబండలోనే ఆయన పలువురు రైతుల కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున సహాయం అందించనున్నారు. జిల్లా పరిధిలో ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలన్నింటికీ పవన్ ఈ సాయాన్ని చేరవేయనున్నారు.
Tags
Related News
AP Politics : ఏపీ ఓటర్ల తీర్పు ఆదర్శం కానుందా..? లేక..
మానసిక స్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే, ఎగ్జిట్ పోల్స్ తెలియాలంటే జూన్ 1 సాయంత్రం 6 గంటల వరకు ఆగాల్సిందే.