HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Jagan Walkout From Ap Assembly 2025

AP Assembly : 5 నిమిషాలకే అసెంబ్లీ నుండి వెళ్లిపోయిన జగన్

AP Assembly : గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైఎస్సార్‌సీపీ సభ్యులు (YCP Leaders) నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు

  • Author : Sudheer Date : 24-02-2025 - 12:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Walkout From Ap Assem
Jagan Walkout From Ap Assem

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly) సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైఎస్సార్‌సీపీ సభ్యులు (YCP Leaders) నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. అసెంబ్లీలో గందరగోళం సృష్టించిన అనంతరం, వైఎస్ జగన్ (Jagan) సభలో కేవలం 5 నిమిషాలపాటు మాత్రమే ఉండి, తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీని వదిలి వెళ్లిపోయారు. ఈ చర్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Makeup Lessons: పురుష పోలీసులకు మేకప్‌లో ట్రైనింగ్.. కారణం తెలిస్తే షాకవుతారు!

అసెంబ్లీ వెలుపల వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి సరైన గౌరవం ఉండాలని, ప్రతిపక్ష హోదాను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను విమర్శించేందుకు అసెంబ్లీలో తగిన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా రైతు సమస్యలపై గొంతు విప్పాలంటే సభలో మాట్లాడే అవకాశం ఉండాలన్నారు. కానీ, వైసీపీ నేతలు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారనే కారణంతోనే ప్రభుత్వం కేసులు పెడుతోందని బొత్స ఆరోపించారు.

ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. వైసీపీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ విధానాలపై చర్చించకుండా, వైసీపీ నేతలు బయట రాజకీయ వేదికలపై విమర్శలు చేయడాన్ని అధికార పార్టీ తప్పుబడుతోంది. అయితే, ప్రతిపక్షం క్రమంగా బలహీనపడుతోందా? లేక ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తోందా? అన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap assembly
  • ycp
  • YS Jagan Walkout

Related News

    Latest News

    • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

    • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

    • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

    • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

    • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

    Trending News

      • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

      • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

      • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

      • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd