Chandrayaan-3: చంద్రుడి సమీప కక్ష్యలో చంద్రయాన్-3.. ఇస్రో వీడియో
చంద్రుడికి అత్యంత సమీపంలోని కక్ష్యలో చంద్రయాన్-3 తన కార్యకలాపాలు చేస్తున్నది. రేపు ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై దిగనుంది
- By Praveen Aluthuru Published Date - 04:14 PM, Tue - 22 August 23
Chandrayaan-3: చంద్రుడికి అత్యంత సమీపంలోని కక్ష్యలో చంద్రయాన్-3 తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. రేపు ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. అయితే ఈ రోజు ల్యాండర్ చంద్రునిపై మరో కొత్త చిత్రాలని ఇస్రోకి చేరవేసింది, వీటిని ఇస్రో ట్విట్టర్ ద్వారా పంచుకుంది. చంద్రయాన్ 3 ఎలా పనిచేస్తుందో ఇస్రో వివరించింది. చంద్రయాన్ 3 బాగా పనిచేస్తోందని ఇస్రో పేర్కొంది. అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. మిషన్ షెడ్యూల్లో ఉందని తెలిపారు.
చంద్రుని ఉపరితలంపై తన ల్యాండర్ ల్యాండింగ్ చేయడానికి ఒక రోజు ముందు, చంద్రయాన్ -3 మిషన్ షెడ్యూల్లో ఉందని మరియు ప్రతిదీ షెడ్యూల్ ప్రకారం పనిచేస్తుందని ఇస్రో తెలిపింది. ఈ వ్యవస్థను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని, ప్రస్తుతానికి అయితే సజావుగా కొనసాగుతోందని ఇస్రో తెలిపింది. దీనితో పాటు ల్యాండర్ విడుదల చేసిన చిత్రాల వీడియోను కూడా ఇస్రో పంచుకుంది.
Chandrayaan-3 Mission:
The mission is on schedule.
Systems are undergoing regular checks.
Smooth sailing is continuing.The Mission Operations Complex (MOX) is buzzed with energy & excitement!
The live telecast of the landing operations at MOX/ISTRAC begins at 17:20 Hrs. IST… pic.twitter.com/Ucfg9HAvrY
— ISRO (@isro) August 22, 2023
చంద్రయాన్ 3 ల్యాండింగ్తో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించనుంది. నిజానికి అంతరిక్ష ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. అయితే, చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ఏకైక దేశం భారతదేశం.
Also Read: YCP : సొంత నేతలపై రజనీ డైలాగ్ పేల్చిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్
Related News
Lok Sabha Polls 2024: ఎన్నికలో ప్రచారంలో బిజీబిజీగా సీఎం రేవంత్…ఈ రోజు షెడ్యూల్ ఇదే
రాష్ట్రంలో లోకసభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గతేడాది ఎన్నికల్లో అనూహ్య విజయంతో అధికారం కాంగ్రెస్, లోకసభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్ని బలోపేతం చేస్తున్నారు.