HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Is There Is Any Breach In The Golden Telangana Tag

Telangana: బంగారు ‘తెలంగాణ’ భంగపాటు!

అవగాహన లోపమో... అధికారుల నిర్లక్ష్యమో.. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడినో.. కారణం ఏదైతేనేం.. వేలకోట్ల ప్రజాధనం మట్టిపాలవుతోంది.

  • By Hashtag U Published Date - 01:27 PM, Mon - 23 May 22
  • daily-hunt
Telangana
Telangana

అవగాహన లోపమో… అధికారుల నిర్లక్ష్యమో.. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడినో.. కారణం ఏదైతేనేం.. వేలకోట్ల ప్రజాధనం మట్టిపాలవుతోంది. తెలంగాణలో ప్రతిష్టాత్మక చేపట్టిన పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తూతూమంత్రంగానే చేపట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతుండటంతో లోటుపాట్లు బయటపడుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణకు దిక్సూచిగా భావించిన బుద్ధవనం, యాదగిరి గుట్ట, కాళేశ్వరం ప్రాజెక్టులు ప్రభుత్వ ఆశలకు గండికొట్టినట్టయింది. ఎన్నో వేలాది కోట్లతో నిర్మించిన యాదాద్రి గుట్టలో పలు సమస్యలు ఇప్పటికే బయటపడగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం లో లోటుపాట్లు కొట్టొచినట్టు కనిపించడంతో సర్వత్వా విమర్శలు వినిపిస్తున్నాయి.

నాణ్యత లోపించిన బుద్ధవనం

అంతర్జాతీయ పర్యాటక కేంద్రం, ప్రముఖ బౌద్ధక్షేత్రంగా విరాజిల్లుతున్న నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో 274 ఎకరాల్లో నిర్మించిన బుద్ధవనం పనుల్లో నాణ్యత లోపించింది.  ప్రభుత్వ నిధులు రూ.70కోట్లతో చేపట్టిన బుద్ధవనం పనులపై పలు పార్టీల నాయకులతో పాటు  ప్రజలు మండిపతున్నారు. పనులు నాణ్యతగా చేయకపోవడమే అందుకు కారణం. రూ.4కోట్ల వ్యయంతో మహాస్తూపం ఇంటీరియర్‌ డెకరేషన్‌, నాలుగు వైపులా నాలుగు ద్వారాలకు టేకుతో తలుపులు ఏర్పాటుచేశారు. అంత ఖర్చు చేసినా మహాస్తూపం తలుపులు నాలుగువైపులా పగిలిపోయాయి. లోపలికి వెళ్లడానికి ఎక్కే మెట్లు విరిగిపోయాయి. అంతే కాకుండా పార్కుల్లో కనీసం పచ్చ గడ్డి కూడా లేదు. పార్కుల్లోని చెట్లు ఎండిపోయాయి. ఇక బోధి వృక్షం పరిసరాలు అపరిశుభ్రంగా చెత్తాచెదారం, ఎండిన ఆకులతో నిండిపోయి అటు పర్యాటకులను, ఇటు ప్రభుత్వ అధికారులను వెక్కిరిస్తున్నాయి. ప్రశాంతతను, ఆహ్లాదాన్ని అందించాల్సిన బుద్ధవనం సమస్యల వనంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సమస్యలకు నిలయం యాదాద్రి

తిరుమల తిరుపతికి ఏమాత్రం తీసిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రిలోను పలు సమస్యలు భక్తులను పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఇప్పుడు కేసీఆర్ ప్రతిష్ఠకే సవాలు విసురుతోంది. ఆలయ పునర్నిర్మాణ పనులలో లోపాలు, గుట్టపై అసౌకర్యాలు ఇప్పుడు ఆయన ప్రతిష్ఠను మసకబరిచేవిగా ఉన్నాయి. బాత్ రూంల  కొరత, నీటి కొరతకు తోడు భక్తులకు నిలవడానికి నీడ లేని పరిస్థితి ఉంది. ఇటీవల కురిసిన ఒక్క జడివానకే రోడ్డు కుంగిపోయి, చలువ పందిళ్లు కూలిపోయి, క్యూలైన్లు మునిగిపోయేంతగా యాదాద్రి వణికిపోయిందంటే..వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలను యాదగిరి గుట్ట తట్టుకు నిలబడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఒక్క వర్షానికే ఘాట్ రోడ్డు దెబ్బతినడమే కాకుండా… అభివృద్ధిపనులలో లోపాలు బయటపడటంతో  ప్రచారంపై ఉన్న శ్రద్ధ ఆలయ పునర్నిర్మాణ పనులపై ప్రభుత్వం చూపలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి.

కాళేశ్వరం కథ అంతంతే!

ఇక తెలంగాణకు మణిహారంగా భావించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని పలు సమస్యలు, లోపాలు బయటపడ్డాయి. దీనిపై ప్రతిపక్షాలు సైతం ఆందోళన కార్యక్రమాలు చేశాయి. భారీ ఎత్తున అవినీతి అరోపణలు వచ్చినట్టు వినిపిస్తున్నాయి. గతంలో కాళేశ్వరం పనుల్లో మేఘా కంపెనీ లోపాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. కాళేశ్వరం లిఫ్టు స్కీంలో భాగంగా సరస్వతి పంప్​హౌస్​ నుంచి సుందిళ్ల బ్యారేజ్​​లోకి నీటిని ఎత్తిపోసేందుకు భూమిలో పాతిన భారీ పైపులైన్ ఇటీవల పైకి తన్నుకొచ్చింది. సుమారు 700 మీటర్ల పొడువున్న ఈ ఐరన్​ పైపులైన్​లో ఏకంగా 200 మీటర్ల మేర  బయటకు తేలడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇవే కాకుండా పలు సమస్యలు ప్రాజెక్టును పట్టిపీడిస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Buddhavanam
  • Kaleshwaram
  • Yadadri Temple

Related News

Ktr

KTR : ఇప్పుడు మీ సీఎం ఏం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా.?

KTR : తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసును సీబీఐకి అప్పగించడంపై రాజకీయ కలకలం చెలరేగింది. ఈ నిర్ణయంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

    Latest News

    • Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

    • Kutami Super 6 : అనంతపురంలో ఈ నెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ

    • Nara Lokesh : శ్రీ ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్

    • TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?

    • Venezuela : కరేబియన్‌లో ఉద్రిక్త వాతావరణం: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం..!

    Trending News

      • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd