Telangana: బంగారు ‘తెలంగాణ’ భంగపాటు!
అవగాహన లోపమో... అధికారుల నిర్లక్ష్యమో.. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడినో.. కారణం ఏదైతేనేం.. వేలకోట్ల ప్రజాధనం మట్టిపాలవుతోంది.
- By Hashtag U Published Date - 01:27 PM, Mon - 23 May 22
అవగాహన లోపమో… అధికారుల నిర్లక్ష్యమో.. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడినో.. కారణం ఏదైతేనేం.. వేలకోట్ల ప్రజాధనం మట్టిపాలవుతోంది. తెలంగాణలో ప్రతిష్టాత్మక చేపట్టిన పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తూతూమంత్రంగానే చేపట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతుండటంతో లోటుపాట్లు బయటపడుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణకు దిక్సూచిగా భావించిన బుద్ధవనం, యాదగిరి గుట్ట, కాళేశ్వరం ప్రాజెక్టులు ప్రభుత్వ ఆశలకు గండికొట్టినట్టయింది. ఎన్నో వేలాది కోట్లతో నిర్మించిన యాదాద్రి గుట్టలో పలు సమస్యలు ఇప్పటికే బయటపడగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం లో లోటుపాట్లు కొట్టొచినట్టు కనిపించడంతో సర్వత్వా విమర్శలు వినిపిస్తున్నాయి.
నాణ్యత లోపించిన బుద్ధవనం
అంతర్జాతీయ పర్యాటక కేంద్రం, ప్రముఖ బౌద్ధక్షేత్రంగా విరాజిల్లుతున్న నాగార్జునసాగర్ హిల్కాలనీలో 274 ఎకరాల్లో నిర్మించిన బుద్ధవనం పనుల్లో నాణ్యత లోపించింది. ప్రభుత్వ నిధులు రూ.70కోట్లతో చేపట్టిన బుద్ధవనం పనులపై పలు పార్టీల నాయకులతో పాటు ప్రజలు మండిపతున్నారు. పనులు నాణ్యతగా చేయకపోవడమే అందుకు కారణం. రూ.4కోట్ల వ్యయంతో మహాస్తూపం ఇంటీరియర్ డెకరేషన్, నాలుగు వైపులా నాలుగు ద్వారాలకు టేకుతో తలుపులు ఏర్పాటుచేశారు. అంత ఖర్చు చేసినా మహాస్తూపం తలుపులు నాలుగువైపులా పగిలిపోయాయి. లోపలికి వెళ్లడానికి ఎక్కే మెట్లు విరిగిపోయాయి. అంతే కాకుండా పార్కుల్లో కనీసం పచ్చ గడ్డి కూడా లేదు. పార్కుల్లోని చెట్లు ఎండిపోయాయి. ఇక బోధి వృక్షం పరిసరాలు అపరిశుభ్రంగా చెత్తాచెదారం, ఎండిన ఆకులతో నిండిపోయి అటు పర్యాటకులను, ఇటు ప్రభుత్వ అధికారులను వెక్కిరిస్తున్నాయి. ప్రశాంతతను, ఆహ్లాదాన్ని అందించాల్సిన బుద్ధవనం సమస్యల వనంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమస్యలకు నిలయం యాదాద్రి
తిరుమల తిరుపతికి ఏమాత్రం తీసిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రిలోను పలు సమస్యలు భక్తులను పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఇప్పుడు కేసీఆర్ ప్రతిష్ఠకే సవాలు విసురుతోంది. ఆలయ పునర్నిర్మాణ పనులలో లోపాలు, గుట్టపై అసౌకర్యాలు ఇప్పుడు ఆయన ప్రతిష్ఠను మసకబరిచేవిగా ఉన్నాయి. బాత్ రూంల కొరత, నీటి కొరతకు తోడు భక్తులకు నిలవడానికి నీడ లేని పరిస్థితి ఉంది. ఇటీవల కురిసిన ఒక్క జడివానకే రోడ్డు కుంగిపోయి, చలువ పందిళ్లు కూలిపోయి, క్యూలైన్లు మునిగిపోయేంతగా యాదాద్రి వణికిపోయిందంటే..వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలను యాదగిరి గుట్ట తట్టుకు నిలబడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఒక్క వర్షానికే ఘాట్ రోడ్డు దెబ్బతినడమే కాకుండా… అభివృద్ధిపనులలో లోపాలు బయటపడటంతో ప్రచారంపై ఉన్న శ్రద్ధ ఆలయ పునర్నిర్మాణ పనులపై ప్రభుత్వం చూపలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి.
కాళేశ్వరం కథ అంతంతే!
ఇక తెలంగాణకు మణిహారంగా భావించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని పలు సమస్యలు, లోపాలు బయటపడ్డాయి. దీనిపై ప్రతిపక్షాలు సైతం ఆందోళన కార్యక్రమాలు చేశాయి. భారీ ఎత్తున అవినీతి అరోపణలు వచ్చినట్టు వినిపిస్తున్నాయి. గతంలో కాళేశ్వరం పనుల్లో మేఘా కంపెనీ లోపాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. కాళేశ్వరం లిఫ్టు స్కీంలో భాగంగా సరస్వతి పంప్హౌస్ నుంచి సుందిళ్ల బ్యారేజ్లోకి నీటిని ఎత్తిపోసేందుకు భూమిలో పాతిన భారీ పైపులైన్ ఇటీవల పైకి తన్నుకొచ్చింది. సుమారు 700 మీటర్ల పొడువున్న ఈ ఐరన్ పైపులైన్లో ఏకంగా 200 మీటర్ల మేర బయటకు తేలడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇవే కాకుండా పలు సమస్యలు ప్రాజెక్టును పట్టిపీడిస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Related News
KTR: మోడీ తరహాలో కేసీఆర్ మత రాజకీయాలు ఏనాడూ చేయలేదు: కేటీఆర్
వచ్చే లోక్సభ ఎన్నికల్లో మతతత్వ పార్టీ బీజేపీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ కోసం బీజేపీ చేసిందేమీ లేదని అన్నారు. బుధవారం మేడ్చల్ నియోజకవర్గం మేడిపల్లిలో జరిగిన కేడర్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ