HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Govt To Do More For Middle Class Nirmala Sitharaman

Nirmala Sitaraman: మధ్య తరగతి కోసం ప్రభుత్వం మరింత చేయబోతోంది: నిర్మలా సీతారామన్

త్వరలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే తరుణంలో మధ్య తరగతి ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. ఈ తరుణంలోనే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతిని ప్రస్తావిస్తూ.. ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు.

  • By Anshu Published Date - 09:59 PM, Mon - 16 January 23
  • daily-hunt
Whatsapp Image 2023 01 16 At 21.36.20
Whatsapp Image 2023 01 16 At 21.36.20

Nirmala Sitaraman: త్వరలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే తరుణంలో మధ్య తరగతి ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. ఈ తరుణంలోనే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతిని ప్రస్తావిస్తూ.. ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. మధ్య తరగతి కష్టాలేంటో తనకు తెలుసునని ఆమె చెప్పడం మీడియా ఛానల్స్ లో హైలెట్ అయింది. ఆరెస్సెస్ కు చెందిన పాంచజన్య మ్యాగజీన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. పలు అంశాల మీద మాట్లాడారు.

దేశంలో అధిక సంఖ్యలో ఉన్న మధ్య తరగతి కోసం మోదీ ప్రభుత్వం మరింత చేయబోతోందని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ‘నేను మధ్య తరగతి నుంచే వచ్చా. మధ్య తరగతి కష్టాలేంటో తెలుసు. ప్రస్తుత మోదీ ప్రభుత్వం మధ్య తరగతిపై ఎలాంటి కొత్త పన్నులు వేయలేదు. రూ.5లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ట్యాక్సులూ వేయలేదు’ అని నిర్మలా సీతారామన్ వివరించారు.

అటు దేశంలోని 27 నగరాల్లో మెట్రో రైలు నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తున్నామన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. 100 స్మార్ట్ సిటీలు నిర్మిస్తున్నామన్నారు. 2020 బడ్జెట్ నుండి ఏటా మూలధన వ్యయం పెంచుకుంటూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ప్రభుత్వ బ్యాంకుల పరిసస్థితి మెరుగైందని, దాదాపు బ్యాంకులకు రూ.2.11లక్షల కోట్ల మూలధ సాయం చేశామని ఆమె వివరించారు.

రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నిర్మలా సీతారామన్.. దానికి అనుగుణంగా అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాగా గతంలో దేశంలో పెరుగుతున్నధర మీద అభ్యంతరకంగా కామెంట్ చేసిన నిర్మలా సీతారామన్.. ఇప్పుడు మాత్రం మధ్య తరగతికి చెందిన వ్యక్తిని తాను అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Finance Minister
  • nirmala sitaraman

Related News

    Latest News

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd