Google: గూగుల్ ఉద్యోగులకు ఇకపై అలాంటివన్నీ బంద్.. స్నాక్స్ తో పాటు?
సాధారణంగా ఉద్యోగులకు మంచి ప్రోత్సాహకాలు ఇచ్చే విషయంలో గూగుల్ సంస్థ ఎల్లవేళలా ముందు ఉంటుంది. కానీ
- By Nakshatra Published Date - 07:00 PM, Sun - 2 April 23
సాధారణంగా ఉద్యోగులకు మంచి ప్రోత్సాహకాలు ఇచ్చే విషయంలో గూగుల్ సంస్థ ఎల్లవేళలా ముందు ఉంటుంది. కానీ ఇప్పుడు అవన్నీ కంపెనీకి భారంగా మారడంతో. కంపెనీ పై పడిన ఆర్థిక భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగానే చిరుతిళ్లు, లాండ్రీ సర్వీస్, మధ్యాహ్న భోజనం వటి వాటిని ఆపేయాలని గూగుల్ నిర్ణయించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు కంపెనీ ప్రధాన ఆర్థిక అధికారి రుత్ పోరట్ ఉద్యోగులకు లేఖ రాశారు.
అంతేకాకుండా మరొకవైపు ఖర్చులను తగ్గించుకోవడం కోసం కొత్త ఉద్యోగుల నియామకాలను సైతం నిలిపివేస్తున్నట్లు పోరట్ పేర్కొన్నారు. ప్రాధాన్యానికి అనుగుణంగా ఉన్న వనరుల్ని ఉపయోగించుకుంటామని తెలిపారు. అందులో భాగంగానే కొంత మంది ఉద్యోగులను ఇతర పనుల్లోకి బదిలీ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ల్యాప్టాప్ల కొనుగోలును సైతం తగ్గించనున్నట్లు తెలిపారు. అయితే, ఈ ప్రోత్సాహకాల కుదింపు ఆఫీసులు ఉన్న ప్రాంతాలు అక్కడ ఉండే వసతులను బట్టి మారుతుందని స్పష్టం చేశారు రుత్ పోరట్.
వ్యయ నియంత్రణలో భాగంగా ఇప్పటికే గూగుల్ భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించింది. ఇటీవలే 12,000 మంది ఉద్యోగులను జాబుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అయితే గూగుల్ సంస్థ బాగానే వృద్ధి చెందుతున్నప్పటికీ, ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తుతున్నట్లు సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై పూర్తి బాధ్యత తనదే అని సుందర్ పిచాయ్ సంస్థ ఉద్యోగులకు తెలిపారు.
Related News
Sundar Pichai: 20 ఏళ్లుగా ఒకే కంపెనీలో.. సుందర్ పిచాయ్పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..!
ప్రపంచంలోనే ప్రముఖ టెక్నాలజీ కంపెనీ గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) 20 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు.