ఈ చిట్కాలు పాటించండి…బట్టతలకు గుడ్ బై చెప్పండి..!!
- By hashtagu Published Date - 11:30 AM, Sun - 5 June 22
బట్టతల సమస్యను మహిళల కంటే ఎక్కువ పురుషులే ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్య కారణం పోషకాహార లోపం. వాతావారణంలో కాలుష్యం, ఇన్ఫెక్షన్లు, వంశపారపర్యం, అనారోగ్య సమస్యలు…ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పవచ్చు. జుట్టుకు సరైన పోషకాలు అందకపోతే..నిర్జీవంగా మారుతుంది. దీంతో అధికమొత్తంలో జుట్టు రాలిపోతుంది. ఈ సమస్యలన్నింటని తగ్గించి జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఇంట్లోనే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.
శనగపిండి:
ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండి, రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల మాడుకు జుట్టుకు బాగా అప్లై చేయాలి. గంట తర్వాత తక్కువ గాఢత ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేసినట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది.
కొబ్బరి నూనె, ఉల్లిపాయ రసం:
కొబ్బరి నూనెకు, ఉల్లిపాయ రసాన్ని కలుపుకుని తలకు బాగా పట్టించాలి. అరగంట తరువాత తలస్నానం చేస్తే.. ఈ మిశ్రమంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టు రాలే సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి.
దాల్చిన చెక్క పౌడర్, తేనె, ఆలివ్ ఆయిల్:
ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ కు తేనె, ఆలివ్ ఆయిల్ ను కలుపుకోవాలి. దీన్ని తలకు బాగా అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే జుట్టుకు తగిన పోషణ అందడంతోపాటు జుట్టు రాలడం తగ్గి బట్టతల సమస్య నుంచి బయటపడవచ్చు.
బీట్ రూట్ ఆకులు:
బీట్ రూట్ ఆకులలో జుట్టు పెరుగుదలకు సహాయపడే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ ఆకులను మెత్తగా పేస్ట్ చేసుకుని తల మాడుకు, జుట్టు మొత్తానికి పట్టించాలి. అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఈవిధంగా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
ఆలివ్ ఆయిల్, నిమ్మరసం:
ఆలివ్ ఆయిల్ కు రెండు స్పూన్ ల నిమ్మరసం కలుపుకొని తలకు పట్టించాలి. అరగంట తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమం చుండ్రు, తలలో ఇన్ఫెక్షన్ లను తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.అంతేకాదు జుట్టురాలే సమస్యలు తగ్గుతాయి.
Related News
Fact Check: కొత్త ఏసీ కంటే పాత కూలర్ కే ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుందా.. నిజమెంత!
Fact Check: వేసవి కాలం వచ్చేసింది. ప్రజలు తమ ఇళ్లలో పక్కన పెట్టేసిన ఏసీలను స్విచ్ ఆన్ చేశారు. ఎందుకంటే అవి లేకుండా వేసవిలో ఒక్కరోజు కూడా గడపడం చాలా కష్టం. ప్రజలు తమ బడ్జెట్కు అనుగుణంగా AC, కూలర్లను ఎంచుకుంటారు. AC ఖరీదైనది. విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా విద్యుత్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. అందుకే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కూలర్లను వాడేందుకు ఇష్టపడుత�