Protocols : భారత్ జోడో యాత్రకు కరోనా బ్రేక్? కోవిడ్ ప్రోటోకాల్ పై కేంద్రం లేఖ
భారత్ జోడో(Bharat Jodo) యాత్రకు కరోనా విజృంభణ ప్రభావం పడనుంది. రాహుల్ చేస్తోన్న భారత్ జోడో(Bharat Jodo) యాత్ర కరోనా
- By CS Rao Published Date - 12:03 PM, Wed - 21 December 22
భారత్ జోడో(Bharat Jodo) యాత్రకు కరోనా విజృంభణ ప్రభావం పడనుంది. చైనా నుంచి దూసుకొస్తోన్న కొత్త వేరియెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఐదు దేశాల్లో కరోనా కొత్త వేరియెంట్ల వ్యాప్తి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించిన నేపథ్యంలో రాహుల్ చేస్తోన్న భారత్ జోడో(Bharat Jodo) యాత్ర కరోనా ప్రోటోకాల్ (Protocols)ను పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. లేదంటే, భారత్ జోడో యాత్రపై నిషేధం తప్పదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా హెచ్చరించడం కరోనా రాజకీయం హీటెక్కిస్తోంది.
పార్లమెంట్ వేదికగా కరోనా వైరస్ తాజా వ్యాప్తిపై ముగ్గురు బిజెపి ఎంపిలు ఆందోళనలను వ్యక్తం చేస్తూ ప్రశ్నలను లేవనెత్తారు. ఆ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి మాండవియా సమాధానం ఇస్తూ కోవిడ్ ప్రోటోకాల్ (Protocols) కు కట్టుబడి ఉండకపోతే భారత్ జోడో యాత్రను సస్పెండ్ చేసే అంశాన్ని పరిశీలించాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కోరారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్లకు రాసిన లేఖలో, రాజస్థాన్కు చెందిన ముగ్గురు ఎంపీలు – పిపి చౌదరి, నిహాల్ చంద్ మరియు దేవ్జీ పటేల్ – ఆందోళనలను ఫ్లాగ్ చేసారని తెలిపారు. మాస్క్లు, శానిటైజర్ల వాడకంతో సహా కోవిడ్ ప్రోటోకాల్లను అభ్యర్థించారని మాండవ్య చెప్పారు. జోడో యాత్ర సమయంలో ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలని, టీకాలు వేసిన వారు మాత్రమే పాల్గొనడానికి అనుమతించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పొందుపరిచారు.
కోవిడ్ ప్రోటోకాల్లకు(Protocols) కట్టుబడి
రాజస్థాన్ నుంచి యాత్ర బుధవారం హర్యానాలోకి ప్రవేశించింది. మార్చ్లో పాల్గొనే ముందు ఆ తరువాత పాల్గొనేవారు భౌతిక దూరంగా పాటించేలా చూడాలని ఎంపీలు కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. రాజస్థాన్లోని ముగ్గురు ఎంపీలు చేసిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని సత్వర చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ, గెహ్లాట్లను కేంద్ర మంత్రి కోరారు. ముగ్గురు ఎంపీలు సంతకం చేసిన లేఖను ప్రస్తావిస్తూ, ప్రజారోగ్యానికి సంబంధించిన ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ ప్రోటోకాల్లకు కట్టుబడి ఉండాలని సూచించారు. లేదంటే, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా యాత్రను నిలిపివేయాలని మాండవ్య కోరారు.
ఇతర రాష్ట్రాల ప్రజలు మార్చ్లో పాల్గొనడానికి రాజస్థాన్కు వస్తున్నందున కోవిడ్ వ్యాప్తి పెరుగుతుందని ముగ్గురు ఎంపీలు ఆందోళన చెందారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటోన్న వాళ్లలో చాలా మందిలో కోవిడ్ లక్షణాలు కనిపించాయని అనుమానిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఈ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్లిన తర్వాత కరోనావైరస్ సంక్రమణకు ఎలా పాజిటివ్ పరీక్షించారో కూడా ఎంపీలు గుర్తు చేశారు. ఎంపీల సంతకాలతో కూడిన లేఖను కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి కాంగ్రెస్ నేతలకు జతచేసి కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించాలని కోరారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించిన నేపథ్యంలో
చైనా వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 4లక్షల కేసుల వరకు ఉన్నాయని డబ్ల్యూ హెచ్ వో (WHO) చెబుతోంది. రాబోవు రోజుల్లో ఆ దేశం కనీసం 10 లక్షల మందిని కోల్పోనుందని అమెరికా పరిశోధనా విభాగం అంచనా వేస్తోంది. ఇప్పటికే చైనాలోని స్మశానాలు శవాలతో నిండిపోయాయని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. రౌండ్ ది క్లాక్ శవాలను దహనం చేయడానికి స్మశానాలను చైనా సిద్ధం చేసిందని న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా పాకింది. ఇప్పటికే ఐదు దేశాల్లో కొత్త వేరియెంట్ సూచనలు కనిపిస్తున్నాయని గమనించిన భారత ప్రభుత్వం అత్యవసరంగా బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం బుధవారం సమావేశం అనంతరం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది.
Also Read : Covid Cases: కరోనా కల్లోలం.. నౌకలో 800 మందికి పాజిటివ్..!
Related News
Covid: దేశంలో స్వల్పంగా కరోనా కేసులు నమోదు
Covid: రెండు నెలలు కిందట కొత్త వేరియంట్ ప్రపంచంలోని అనేక దేశాల్లో వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. విదేశాల నుంచి వచ్చే వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కేంద్ర హెచ్చరికలతో అప్రమత్తమైన రాష్ట్రాలు భారీ ఎతత్తున పరీక్షలు నిర్వహించాయి. కొవిడ్ పాజిటివ్ వచ్చిన �