Nose-Bleed Fever : ఇరాక్ ను వణికిస్తోన్న కాంగో ఫీవర్..ముక్కు నుంచి రక్తం కారి మరణిస్తున్న జనం.!!
ఇరాక్....ప్రాణాంతక కాంగో ఫీవర్ తో గజగజా వణికిపోతోంది. దేశంలో ఈ మధ్య కాలంలో ఈ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి.
- By Hashtag U Published Date - 10:09 AM, Mon - 30 May 22
ఇరాక్….ప్రాణాంతక కాంగో ఫీవర్ తో గజగజా వణికిపోతోంది. దేశంలో ఈ మధ్య కాలంలో ఈ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. దీంతో దేశంలో ఆందోళన నెలకొంది. ఇక్కడ ఈ ఏడాది వరకు 19 వరకు కాంగో ఫీవర్ బారినపడి మరణించినట్లు WHO చెబుతోంది. జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తున్న ఈ వ్యాధి సోకిత్ జ్వరం, ముక్కునుంచి రక్తం కారడం వంటి లక్షణాలతో మరణిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు.
నైరో వైరస్ అని పిలిచే క్రిమియన్-కాంగో హోమోరేజిక్ ఫీవర్ అనే రక్తం పీల్చే పేలు Tick Bite ద్వారా కాంగో ఫీవర్ జంతువుల నుంచి మనుషులకు సోకుతోంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల మలం, రక్తం, చెమట కణాల నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు డబ్య్లూహెచ్ ఓ చెబుతోంది. ఇరాక్ లో 1979లో తొలిసారిగా ఈ వైరస్ వెలుగు చూసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. కోవిడ్ కారణంగా పశువుల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయకపోవడం వల్లే గ్లోబల్ వార్మింగ్ వంటివి ఈ వ్యాధి వ్యాప్తికి కారణమౌతున్నట్లు WHOఅంచనా వేస్తోంది.
Related News
US Drone Strike: అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తత.. కారుపై డ్రోన్ దాడి, టాప్ కమాండర్ సహా ముగ్గురు మృతి
అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇక్కడ తాజా పరిణామంతో ఇరాక్ రాజధాని బాగ్దాద్లో అమెరికా.. కారుపై డ్రోన్ దాడి (US Drone Strike) చేసింది.