HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Congress And Bjp Parties Are Enemies Of Farmers Minister Harish Rao

Harish Rao: కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు రైతుల పాలిట శత్రువులు : మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు రైతుల పాలిట శత్రువులని తెలంగాణ మంత్రి హరీశ్ రావు జాతీయ పార్టీలపై విరుచుకుపడ్డారు.

  • Author : Balu J Date : 22-11-2023 - 1:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harishrao
Harishrao

Harish Rao: కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు రైతుల పాలిట శత్రువులని తెలంగాణ మంత్రి హరీశ్ రావు జాతీయ పార్టీలపై విరుచుకుపడ్డారు. బుధవారం సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని సీతారామన్‌పై మండిపడ్డారు. బీజేపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం రూ.100 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. జీఎస్‌డీపీకి తెలంగాణ అప్పులు 28 శాతం మాత్రమేనని, బీజేపీ పాలిత కేంద్రం జీడీపీలో 57 శాతం అప్పులు ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి అన్నారు. కనీస అప్పులు ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ దిగువ నుంచి ఆరో స్థానంలో ఉందని పేర్కొన్నారు. రూపాయి విలువ క్షీణతకు, దేశంలో అత్యధిక నిరుద్యోగిత రేటుకు బీజేపీయే కారణమని హరీశ్ రావు ఆరోపించారు.

బీజేపీ హయాంలోనే వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.1,200కి పెరిగిందన్నారు. ”కాంగ్రెస్‌, భాజపాలు రైతుల పాలిట శత్రువులు. ఆ విషయం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలతో తెలిసిపోయింది. స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయకుండా అడ్డుకున్నది కాంగ్రెస్‌ పార్టీ. మేము అధికారంలోకి వస్తే ఆ సిఫార్సులను అమలు చేస్తామని బీజేపీ కేంద్రంలో గద్దెనెక్కింది. ఆ రెండు పార్టీలు ఆ హామీని అమలు చేయలేదు. దాంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది” అని అన్నారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామని కేంద్రం చెప్పినా కేసీఆర్‌ అంగీకరించలేదని, 60 లక్షల మంది రైతుల ప్రయోజనాలు ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నారని, అందుకోసం రూ.25వేల కోట్లు వదులుకున్నారని అన్నారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు లేకుండా చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోందని హరీశ్‌ రావు ఆరోపించారు. రాజస్థాన్‌, హిమాచల్, కర్ణాటక వంటి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు కూడా మీటర్లు పెట్టడానికి అంగీకరించి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నాయని, పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణలో కూడా మోటార్లకు మీటర్లు వస్తాయన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP and congress
  • hard comments
  • harish rao
  • Nirmala Sitaramanan

Related News

Harish Rao Pm

రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం

గత ఏడాది అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వచ్చి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించినా, ఏడాది గడిచినా ఒక్క పైసా విదల్చలేదని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 1100 కోట్ల బోనస్ నిధులు, పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు

  • Harish Rao Movie Tickets

    మరో భారీ స్కామ్ ను బయటపెట్టి, కాంగ్రెస్ సర్కార్ కు షాక్ ఇచ్చిన హరీష్ రావు

  • Phone Tapping Santhosh

    ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

  • Harish Rao Movie Tickets

    స్కామ్ లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేసారంటూ హరీష్ రావు సూటి ప్రశ్న

Latest News

  • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

  • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

  • అతడి భార్య అందంగా ఉందని పదవి ఇచ్చా..నోరు జారిన డోనాల్డ్ ట్రంప్..!

  • సంజు శాంసన్‌పై సూర్యకుమార్ యాదవ్ సరదా వ్యాఖ్యలు!

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd