KCR fires on Modi: ప్రధాని పదవి సరిపోదా.. ఇంకేం కావాలి ? మోదీపై కేసీఆర్ ఫైర్
గత కొంత కాలంగా ప్రధాని మోదీపై విమర్శలతో మండిపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రత స్థాయిని మరింత పెంచారు.
- By Naresh Kumar Published Date - 07:41 PM, Thu - 25 August 22
గత కొంత కాలంగా ప్రధాని మోదీపై విమర్శలతో మండిపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రత స్థాయిని మరింత పెంచారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నెలకొన్న పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో చాలా ప్రమాదకరమైన పరిణామాలు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. తనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని సీఎం ప్రారంభించిన అనంతరం కొంగర కలాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ నిప్పులు చెరిగారు. ప్రధాని పదవి సరిపోదా.. ఇంకేం కావాలంటూ తీవ్రస్థాయిలో మోదీపై మండిపడ్డారు. మనం నిద్రపోతే పెద్ద ప్రమాదానికి లోనవుతామని.. తెలంగాణను కాపాడే బాధ్యత తనదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. తమిళనాడు, బెంగాల్, ఢిల్లీలో ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయనీ చెప్పారు.హైదరాబాద్ లో 24 గంటల కరెంట్ ఉంటే.. ఢిల్లీలో ఉండదన్నారు. ప్రధాని కుట్రలు చేసి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడుతున్నారనీ, తాను బతికుండగా తెలంగాణను ఆగం కానివ్వమంటూ వ్యాఖ్యానించారు. చిన్న నిర్లక్ష్యం కారణంగా 58 ఏళ్లు తెలంగాణ పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. రైతు బంధు, రైతు బీమాలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని కేసీఆర్ చెప్పుకొచ్చారు. 24 గంటలు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని గుర్తు చేశారు.
పంటల తెలంగాణ కావాలా..? మంటల తెలంగాణ కావాలా అని సీఎం ప్రశ్నించారు. కేంద్రం ఇన్నేళ్లలో ఒక్క మంచిపనైనా చేసిందా ..మనం మౌనంగా భరిద్దామా అని కేసీఆర్ నిలదీశారు. ఇలాగే వదిలేస్తే తాను చెప్పినట్లుగా మత పిచ్చి మంటలే వస్తాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు . హిజాబ్, హలాల్ అంటూ బెంగళూరులో మతపిచ్చి లేపి వాతావరణాన్ని కలుషితం చేశారని సీఎం ఆరోపించారు. తెలంగాణలోనూ పరిశ్రమలు రాకుండా వుండాలా, ఐటీ రంగం పారిపోవాలా, పిల్లలకు ఉద్యోగాలు వద్దా, రంగారెడ్డి జిల్లా భూములు పడిపోవాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు వ్యక్తులు రాష్ట్రంలో మతచిచ్చు పెడుతున్నారని.. ఇలాంటి చూస్తూ ఊరుకోవాలా అని సీఎం నిలదీశారు. ఎనిమిదేళ్ల నుంచి తెలంగాణలో కఠినంగా వ్యవహరిస్తున్నామని, ప్రశాంతంగా వున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ తలసరి ఆదాయం, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని, మంచినీటి సదుపాయం వచ్చిందన్నారు. మత శక్తుల పిచ్చికి మనం లోనైతే మళ్లీ పాత తెలంగాణ మాదిరిగా తయారవుతామని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ద్వేషం, అసూయ, కర్ఫ్యూలతో ఎవరూ బాగుపడరని సీఎం అన్నారు. స్వార్ధ, నీచ మతపిచ్చిగాళ్లను తరిమికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
Related News
PM Modi: కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల శక్తి బీజేపీ-ఎన్డీయేకు మాత్రమే ఉంది : ప్రధాని మోదీ
PM Modi: తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలకు దూరదృష్టి లోపించిందని, బీజేపీ-ఎన్డీయే మినహా మరే రాజకీయ శక్తి ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ 15 సీట్లకు మించి గెలవదు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా హాఫ్ సెంచరీ మార్కును కూడా దాటలేకపోతోంది. పశ్చిమబెంగాల్ లో కూడా వామపక్షాల పరిస్థితి ఏంటో �