MP Gorantla: ఎంపీ గోరంట్ల మాధవ్ కు చేదు అనుభవం!
వైసీపీ ఎమ్మెల్యే గోరంట్ల మాధవ్ కు చేదు అనుభవం ఎదురైంది. హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
- By Balu J Published Date - 10:59 PM, Tue - 6 December 22
వైసీపీ ఎమ్మెల్యే గోరంట్ల మాధవ్ కు చేదు అనుభవం ఎదురైంది. హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించేందుకు మాధవ్ అక్కడకు వచ్చారు. అయితే కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాకపోవడంతో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆగిపోయింది.
దీంతో, గోరంట్ల మాధవ్ ను దళిత సంఘాల నేతలు నిలదీశారు. ఎమ్మెల్సీ రాకపోతే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నచ్చచెప్పేందుకు మాధవ్ ప్రయత్నించినా వారు వినలేదు. దీంతో, విగ్రహాన్ని ఆవిష్కరించకుండానే, పూలదండ వేసి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Related News
Minister Peddireddy : హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి కి నిరసన సెగ
హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైసీపీ మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ ఎదురైంది. లేపాక్షి మండలం మానెంపల్లిలో తమ ఊరుకు రహదారి వేయడంలేదని మంత్రిని అడ్డుకున్నారు. దీంతో మంత్రి షాక్ అయ్యారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Elections) ముంచుకొస్తుండడంతో అక్కడి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ…ఈసారి కూడా విజయం సాధించాలని పక్క ప్