Nara Lokesh: నారా లోకేశ్ కు కరోనా పాజిటివ్!
- By Balu J Published Date - 02:30 PM, Mon - 17 January 22
ఏపీలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ప్రతిరోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఎలాంటి లక్షణాలు లేవు. కానీ కొవిడ్ బారిన పడ్డాను. డాక్టర్ల సూచన మేరకు హోంఐసోలేషన్ లో ఉన్నాను. త్వరలోనే కోలుకుంటాను. నాతో పరిచయం ఉన్నవారు వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. కాగా కరోనా పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కెబినెట్ మీటింగ్ జరుగుతోంది!
I have tested positive for COVID-19.
I’m asymptomatic and feeling fine but will be self-isolating until recovery.
I request those who have come in contact with me to get tested at the earliest and take necessary precautions.
Urging everyone to stay safe. 🙏
— Lokesh Nara (@naralokesh) January 17, 2022
Related News
Nara Lokesh: నేడు నంద్యాలలో లోకేష్ పర్యటన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగలం పేరుతో ఇప్పటికే ఆయా నియోజకవర్గాలను చుట్టేశారు. అందులో భాగంగా ఏఈ రోజు ఆయన నంద్యాలలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.