PRC Issue : ఏపీ ఉద్యోగులకు హైకోర్టులో షాక్
కొత్త పీఆర్సీ జీవోలను నిలిపివేస్తూ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు
- By CS Rao Published Date - 02:41 PM, Mon - 24 January 22
పీఆర్సీ అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ పై విచారణ జరిగింది. జీతాలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి ఉందని తేల్చింది.పీఆర్సీ వల్ల జీతం పెరిగిందా? తగ్గిందా? అని ప్రశ్నించిన హైకోర్టు వేసిన ప్రశ్నకు ఉద్యోగుల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో అసహనం వ్యక్తం చేసింది.ఉద్యోగుల గ్రాస్ శాలరీ పెరిగిందన్న ఏజీ వివరించారుప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీర్సీపై ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఉద్యోగుల జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది.హెచ్ఆర్ఏ విభజన చట్టం ప్రకారం జరగలేదంటూ హైకోర్టు దృష్టికి పిటిషనర్ తెచ్చారు. అయితే ఈ ఆరోపణపై హైకోర్టు ఏకీభవించలేదు. పీఆర్సీ వల్ల జీతం పెరిగిందా? తగ్గిందా? అనేది చెప్పాలని కోర్టు అడిగింది. మీకు ఎంత జీతం తగ్గిందో చెప్పాలని… అంకెల్లో ఈ లెక్కలు అందజేయాలని వ్యాఖ్యానించింది. పూర్తి డేటా లేకుండా కోర్టుకు ఎలా వస్తారని ప్రశ్నించింది. పర్సెంటేజిని ఛాలెంజ్ చేసే హక్కు మీకు లేదని తెలిపింది. ఈ పిటిషన్ కు చట్టబద్ధత లేదని వ్యాఖ్యానించింది. మరోవైపు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ తన వాదలను వినిపిస్తూ… ఉద్యోగుల గ్రాస్ శాలరీ పెరిగిందని కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన లెక్కలను అందించారు.
Tags
Related News
AP Elections 2024: వైసీపీకి భారీ ఊరట.. చంద్రబాబు, షర్మిల, పవన్ కు కోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది ప్రధానంగా ఎన్డీయే, వైసీపీ మధ్య రసవత్తర పోరు కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ప్రధాన ఎజెండాగా మారింది.