Actor Naresh: మైసూరుకు చేరిన వివాద బంధం
నరేశ్ - పవిత్ర లోకేశ్.. ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన పేర్లు. వీరిద్దరి రిలేషన్షిప్ వ్యవహారం రచ్చకెక్కింది.
- By Naresh Kumar Published Date - 02:43 PM, Sun - 3 July 22
నరేశ్ – పవిత్ర లోకేశ్.. ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన పేర్లు. వీరిద్దరి రిలేషన్షిప్ వ్యవహారం రచ్చకెక్కింది. తనకు విడాకులు ఇవ్వకుండానే నరేశ్ పవిత్ర లోకేశ్ను వివాహాం చేసుకుంటున్నాడని మూడో భార్య రమ్య ఆరోపిస్తున్నారు. అయితే ఆమె కావాలనే ఆరోపణలు చేస్తుందంటూ నరేశ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అటు పవిత్ర లోకేశ్ కూడా రమ్య చేసిన ఆరోపణలపై ధీటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి మధ్య నెలకొన్న వివాదం చర్చనీయాంశమైంది. అయితే తాజాగా ఈ రచ్చ మైసూరుకు చేరింది.
పవిత్ర లోకేశ్ , నరేశ్ ఇద్దరూ ఓ హోటల్లో ఉన్నారని తెలుసుకున్న రమ్య పోలీసులతో కలిసి వారిని పట్టించే ప్రయత్నం చేసింది. ఇద్దరినీ అక్కడ చూసిన ఆమె కోపం పట్టలేక చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించింది. రమ్యను అక్కడున్న పోలీసులు అడ్డుకోగా…నరేశ్, పవిత్ర లోకేశ్ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళేక్రమంలో నరేశ్ విజిల్స్ వేస్తూ రమ్యను రెచ్చగొట్టడం కనిపించింది.
స్థానిక మీడియా ప్రతినిధులు ఈ మొత్తం ఎపిసోడ్ను కవర్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్గా మారాయి. రమ్య కూడా ఉన్న కొందరు నరేశ్ వ్యతిరేకంగా నినాదాలు చేయడం కూడా కనిపించింది. పోలీసుల సాయంతో నరేశ్ , పవిత్ర లోకేశ్ ఒకే కారులో అక్కడ నుంచి వెళ్ళిపోగా.. రమ్య తనకు న్యాయం చేయాలంటూ మీడియా ముందు వాపోయింది. నరేశ్కు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని, తన కుమారుడు కూడా డివోర్స్కు ఒప్పుకోవడం లేదని తెలిపింది. వివాహం చేసుకోలేదంటూ చెబుతూనే ఒకే రూమ్లో ఎలా ఉంటారంటూ ప్రశ్నించింది. మరోవైపు
నరేష్ వాదన మరోలా ఉంది. రమ్య చెప్పేవన్నీ అబద్దాలు అంటున్నారు. రమ్య వల్ల తన కుటుంబ పరువు బజారున పడుతోందని , ఆమె 50 లక్షలు ఇమ్మని బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించారు. రమ్య రఘపతికి విడాకుల నోటీసులు పంపి నెల రోజులు అయిందని చెప్పారు. ఇక నరేష్ చాలా మంచి వ్యక్తి అని పవిత్ర లోకేశ్ ఇంతకముందే విడుదల చేసిన వీడియోలో కితాబిచ్చారు. తమ మధ్య ఏ దాపరికాలూ లేవని ఆమె అన్నారు. ప్రస్తుతం తాను నరేష్కు తోడుగా ఉంటున్నానని పవిత్ర స్పష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ మూడు స్తంభాలాట ఎలా ముగుస్తుందో చూడాలి.
Tags
Related News
Tipu Sultan’s Sword: టిప్పు సుల్తాన్ కత్తి వేలం.. ఎన్ని కోట్ల ధర పలికిందో తెలుసా..?
మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ కత్తిని (Tipu Sultan’s Sword) 100800 బ్రిటిష్ పౌండ్లకు (దాదాపు రూ. 10 కోట్ల 80 లక్షలు) విక్రయించారు.