Whales: లో 500 పైలట్ వేల్స్ మృతి.. కారణం?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో రకాల జీవరాశులు రోజు రోజుకి అంతరించిపోతూనే ఉన్నాయి. కాగా ఇప్పటికే ఎన్నో రకాల
- By Nakshatra Published Date - 05:45 AM, Thu - 13 October 22
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో రకాల జీవరాశులు రోజు రోజుకి అంతరించిపోతూనే ఉన్నాయి. కాగా ఇప్పటికే ఎన్నో రకాల జీవరాసులు అంతరించిపోగా మరికొన్ని అంతరించిపోతూనే ఉన్నాయి. ఉన్న జీవాలను సంరక్షించుకోవడం కోసం పర్యావరణ శాస్త్రవేత్తలు అలాగే అటవీ అధికారులు వాటి పట్ల ఎంతో అప్రమత్తంగా ఉంటున్నారు. అయినప్పటికీ వివిధ కారణాలవల్ల జంతువులు అంతరించిపోవడం చనిపోవడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా న్యూజిలాండ్ లో ఒక హృదయ కారణ ఘటన చోటు చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 తిమింగలాలు మృతి చెందాయి. ఈ వార్త విన్న నెటిజన్స్ సో సాడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఒకేసారి అన్ని మూగజీవాలు మరణించడం చాలా మందిని కలిచి వేసింది. న్యూజిలాండ్ లోని చాథమ్ దీవుల వద్ద ఆ జల జీవాలు ప్రాణాలు విడిచాయి. తాజాగా ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
చాథమ్ దీవులలో 250 తిమింగలాలు, అలాగే పిట్ దీవిలో 240 తిమింగలాలు మృతి చెందినట్లుగా వెల్లడించింది. అయితే ఆ రెండు దీవులు న్యూజిలాండ్ కు చాలా దూరంగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ కు కష్టంగా మారినట్టు తెలిపారు. ఆ ప్రాంతంలో డేంజరస్ షార్కులు ఉన్నాయని, అవి వేల్స్ పై అలాగే మనుషులపై కూడా దాడి చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దాంతో రెస్క్యూ ఆపరేషన్ అన్నది అసాధ్యంగా మారినట్లు మెరైన్ అడ్వైజర్ దేవ్ లుండ్ కిస్ట్ తెలిపారు. అయితే ఆ తిమింగలాలు సహజంగానే డి కంపోజ్ కానున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంతకుముందే అనగా 1981లో చాథమ్ దీవిలో సుమారుగా 1000కి పైగా తిమింగలాలు మృత్యువాత పడినట్లు అధికారులు వెల్లడించారు. తిమింగలాలు కనీసం 6 మీటర్ల పొడుగు పెరుగుతాయి.
Related News
T20 World Cup 2024: న్యూజిలాండ్ను చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్
గయానా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో గ్రూప్-సి మ్యాచ్లో న్యూజిలాండ్ను 84 పరుగుల తేడాతో ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ అద్భుత ప్రదర్శన చేసింది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 159 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. న్యూజిలాండ్ను 15.2 ఓవర్లలో కేవలం 75 పరుగులకే ఆలౌట్ చేసింది.