Tractor: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. ట్రాక్టర్పై దెయ్యం.. దానంతట అదే..
ప్రస్తుతం సమాజం సాంకేతికత వైపు పరుగులు పెడుతుంది. రాకెట్లతో పాటు మనుషులు కూడా అంతరిక్షంలోకి అడుగుపెడుతున్నారు.
- By Nakshatra Published Date - 11:00 PM, Fri - 3 March 23
Tractor: ప్రస్తుతం సమాజం సాంకేతికత వైపు పరుగులు పెడుతుంది. రాకెట్లతో పాటు మనుషులు కూడా అంతరిక్షంలోకి అడుగుపెడుతున్నారు. మూఢ నమ్మకాలు లాంటివి సమాజంలో రోజురోజుకి తగ్గిపోతున్నాయి. టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. అయినా ఈ రోజుల్లో కూడా కొంతమంది దెయ్యాలను నమ్ముతున్నారు. దెయ్యాలను తాము చూశామని చెబుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది.
ఆగి ఉన్న ట్రాక్టర్ ఎవరు నడపకుండానే దానంతట అదే కదిలింది. ఈ దృశ్యం సీసీ కెమెరాల్లో కూడా రికార్డు అయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో జరిగింది. ఓ షాపు ముందు ట్రాక్టర్ పార్క్ చేసి ఉంది. అయితే ఏమైందో ఏమో కానీ ట్రాక్టర్ ఎవరూ డ్రైవ్ చేయకుండానే ఆటోమేటిక్ గా కదిలింది. ట్రాక్టర్ గేర్ లో ఉండటంతో షాపు మెట్లు కూడా ఎక్కి షాపు అద్దాలను ఢీకొట్టింది. దీంతో షాపు అద్దాలు అన్నీ పగిలిపోయాయి. అనంతరం ఒక చెట్టు అడ్డుపడటంతో ట్రాక్టర్ ఆగింది. అంతలోనే ఒకరు వచ్చి ట్రాక్టర్ బ్రేకులు వేశారు.
ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ షాపు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ట్రాక్టర్ పై దెయ్యం ఉందని, అదే నడిపి ఉంటుందని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ట్రాక్టర్ దానంతట అదే కదలడానికి అనేక కారణాలను చెబుతున్నారు. ట్రాక్టర్ గేరులో ఉండటంతో అది కదిలి ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అక్కడ రోడ్డు వాలుగా ఉండి ఉంటుందని, అందుకే కదిలి ఉండొచ్చని మరికొంతమంది చెబుతున్నారు. ఏది ఏమైనా ఎవరూ నడపకుండా ట్రాక్టర్ కదలడం అందరిన ఆశ్చర్యపరుస్తోంది. దీనికి గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.నెటిజన్లు తమకు తోచినట్లు కారణాలను చెబుతున్నారు.
Tags
Related News
Kasganj Accident: యూపీలో చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: 19 మంది మృతి
యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. గంగాస్నానానికి వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ బదౌన్ హైవేపై దరియావ్గంజ్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడింది. ఈ ప్రమాదంలో చిన్నారులు సహా 19 మంది మృతి చెందినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. ట్రాక్టర్పై వెళ్తున్న వ్యక్తులు జలసమాధి అయ్యారు.