Mars: మార్స్ పై సముద్రాలు ఉండేవా? శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలు ఇవే!
అంతరిక్షంలో శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎన్నో రకాల విషయాలను కనుగొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు
- By Nakshatra Published Date - 08:45 AM, Mon - 21 November 22
అంతరిక్షంలో శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎన్నో రకాల విషయాలను కనుగొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు కనుగొన్నది ఒక ఎత్తు అయితే ఇంకా కనుగొనవలసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. అంతరిక్షంలో తెలియాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అనగా అంతరిక్షం అన్నది ఒక సముద్రం అయితే అందులో మన శాస్త్రవేత్తలు కనుగొన్నది కేవలం రెండు మూడు నీటి చుక్కలే అని చెప్పవచ్చు. ఇప్పటికీ అనేక విషయాల గురించి ఈ పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. మరి ముఖ్యంగా అంగారక గ్రహం(మార్స్) పై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరపగా ఆ గ్రహం గురించి అనేక విషయాలు తెలుసుకోవడానికి పరిశోధనలను జరుపుతూనే ఉన్నారు.
అయితే భూగ్రహం లాగే అంగాలక గ్రహం మీద కూడా మానవుడు నివసించడానికి సరిపోయే వనరులు ఉన్నాయో లేదో అని తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అంగారక గ్రహం ఎప్పుడు నిర్జనంగా ఎర్రటి ఎడారిగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అంగారక గ్రహం గురించి శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని వెల్లడించారు. అదేమిటంటే ఎప్పుడు ఎర్రటి ఎడారిగా నిర్జనంగా కనిపించే అంగారక గ్రహం ఒకప్పుడు నీళ్లతో నిండి నీలి రంగులో కనిపించేది అని తాజా అధ్యయనంలో పేర్కొన్నారు. అంగారక గ్రహం పై గతంలో నీరు ఉండేదని పరిశోధకులు చాలా ఏళ్లుగా చెబుతున్నప్పటికీ ఆ గ్రహంపై ఎంత మేర వరకు నీరు ఉన్నది అన్న దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
అయితే అదే విషయంపై పరిశోధనలు జరపగా 450 కోట్ల ఏళ్ల కిందట అంగారకుడు విగ్రహం పై 984 అడుగుల లోతు మహాసముద్రాలు ఉండేవి అని కోపెన్ హగెన్ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. వందల కోట్ల క్రితం అంగారక గ్రహం ను మంచుతో కూడిన గ్రహ శకలాలు ఢీకొట్టాయని వారు వెల్లడించారు. అంతేకాకుండా అంగారక గ్రహంపై గాలి అలాగే ఇదివరకు నదులు పారినట్టుగా గత అధ్యయనాలలో శాస్త్రవేత్తలు కనుగొన్న విషయం తెలిసిందే. దాంతో అక్కడ ఖచ్చితంగా జీవం ఉండి ఉంటుంది అభిప్రాయాలు పడ్డ శాస్త్రవేత్తలు అందుకు సంబంధించిన పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు.
Related News
BRS vs CM Revanth: అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది రేవంత్ రెడ్డి: బీఆర్ఎస్ ట్వీట్
కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది…మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది.