Vinayaka Chavithi: వినాయక చవితి రోజు గణేశుడికి 21 రకాల ఆకులతో ఎందుకు పూజిస్తారో తెలుసా?
హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి పండుగ రోజు చాలామంది ఇంట్లో బయట భారీ విగ్రహాలను ఏ
- By Nakshatra Published Date - 09:20 PM, Wed - 13 September 23
హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి పండుగ రోజు చాలామంది ఇంట్లో బయట భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేస్తూ ఉంటారు. విగ్రహాల మండపాల కోసం విగ్రహాల కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే వినాయక చవితి పూజలో స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలను నైవేద్యంగా పెట్టడంతో పాటు 21 పత్రాలతో పూజించడం అన్నది తప్పనిసరి. అయితే చాలా మందికి 21 పత్రాలు దొరకడం కష్టంగా ఉంటుంది. అటువంటి సమయంలో ఎన్ని పత్రాలు దొరికితే అన్నింటితో పూజ చేస్తే మంచి ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. విఘ్నేశ్వరుడికి 21 పత్రాలతో పూజ చేయాలి.
21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహాత్కృష్టమైన, శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయడం వల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది. 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలీ అని సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు- వీటిలో వర్షాలవల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం. వీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితోబాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడం, అలా నీటిలో కలిపిన మట్టి, 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కలాయిడ్స్ని ఆ జలంలోకి వదిలేస్తాయి.
అవి బాక్టీరియాను నిర్మూలించి, నీటిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి. వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. ఇంతకీ ఆ 21 పత్రాలు ఏవి? వాటి పేర్లు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. మాచీ పత్రం, బృహతీ పత్రం(ములక), బిల్వ పత్రం, దూర్వా పత్రం (గరిక), దుత్తూర పత్రం(ఉమ్మెత్త), బదరీ పత్రం(రేగు), అపామార్గ పత్రం(ఉత్తరేణి), తులసీ, చూత పత్రం(మామిడి ఆకు) కరవీర పత్రం(గన్నేరు) విష్ణుక్రాంత పత్రం, దాడిమీ పత్రం (దానిమ్మ ఆకు)దేవదారు పత్రం, మరువక పత్రం, సింధువార పత్రం, జాజి పత్రం, గండలీ పత్రం, శమీ పత్రం(జమ్మిచెట్టు) అశ్వత్థ పత్రం(రావి ఆకులు), అర్జున పత్రం(మద్దిచెట్టు),
అర్క పత్రం(జిల్లేడు).. ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి లభిస్తుంది.
Related News
Chandrayaan Ganapathi : ‘చంద్రయాన్-3’ గణపతుల సందడి.. ఫొటోలు వైరల్
Chandrayaan Ganapathi : చంద్రయాన్ -3 మిషన్ లో భారత్ సాధించిన ఘన విజయాన్ని వినాయక చవితి వేళ దేశ ప్రజలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.