Independence Day 2023: ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటకు 1800 మంది ప్రత్యేక అతిధులు?
ఈసారి 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎర్రకోట వేదికగా ఘనంగా జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ వేడుకలు జరగనున్నాయి.
- By Nakshatra Published Date - 04:15 PM, Mon - 14 August 23
ఈసారి 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎర్రకోట వేదికగా ఘనంగా జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఈసారి జరగబోతున్న ఈ వేడుకలు ఎప్పటిలాగా కాకుండా కాస్త కొత్తగా జరగబోతున్నట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఈ ఏడాది దాదాపు 1800 మంది అతిథులు వారి వారి జీవిత భాగస్వామితో కలిసి ఉత్సవాల్లో పాలుపంచుకోనున్నారు. ఇందులో రైతులు, చేపలు పట్టేవారు, నర్సులు సహా వివిధ కులవృత్తులు చేసేవారు ఉండనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 75 జంటలు సాంప్రదాయ శైలిలో వేడుకల్లో కనువిందు చేయనున్నారు.
ప్రత్యేక అతిథుల్లో 660 గ్రామాల నుంచి 400 మంది సర్పంచులు, 250 మంది రైతు సంఘాల సభ్యులు, 50 చొప్పున ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన సభ్యులు, సెంట్రల్ విస్టాకు చెందిన 50 మంది కార్మికులు, 50 మంది ఖాదీ కార్మికులు, స్కూల్ టీచర్లు, నర్సులు, చేపలు పట్టేవారు ఇందులో పాలు పంచుకోనున్నారు. ఈ ప్రత్యేక అతిథులు కొంత మంది జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించనున్నారు. జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన ఈ ప్రత్యేక అతిథులకు వసతి సౌకర్యం కల్పించనున్నారు.
కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు 75 జంటలు వారి సాంప్రదాయ శైలిలో వేడుకల్లో పాల్గొన బోతున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ జెండాకు వందనం చేయనున్నారు. జాతిని ఉద్దేశించి ఉపన్యాసం ఇస్తారు. కాగా దేశంలో ఉన్న పథకాలపై 12 సెల్ఫీ లొకేషన్స్ను వేడుకల్లో ఏర్పాట్లు చేశారు. వాక్సిన్, యోగా, ఉజ్వల్ యోజన, స్పేస్ పవర్, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా సహా తదితర స్కీలకు సంబంధించిన లొకేషన్స్ను ఏర్పాటు చేశారు. ఆగష్టు 15 నుంచి ఆగష్టు 20 వరకు ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్ను నిర్వహించనున్నారు. ఆయా ప్రదేశాల్లో సెల్ఫీ దిగి మై గౌవ్ పోర్టల్లో అప్లోడ్ చేసిన 12 మందిని విజేతలుగా నిర్ణయిస్తారు. వారికి రూ.10,000 చొప్పున ప్రైజ్మనీని కూడా ఇస్తారట.
Related News
Independence Day 2023: బీసీసీఐ కి షాకిచ్చిన మోడీ
దేశమంతా ఈ రోజు 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దేశప్రజలంతా తమ సోషల్ మీడియా డిస ప్లే ఫోటోకి మువ్వెన్నల జెండాను పెట్టుకోని దేశభక్తి చాటుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.