NOTA : ‘నోటా’కు ఓటేస్తే ఏమవుతుందో తెలుసా ? దీని చరిత్ర ఇదిగో
NOTA : ‘నోటా’.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం(ఈవీఎం)లోని ప్రత్యేకమైన ఆప్షన్.
- By Pasha Published Date - 10:13 AM, Sun - 31 March 24
NOTA : ‘నోటా’.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం(ఈవీఎం)లోని ప్రత్యేకమైన ఆప్షన్. ఎన్నికల్లో పోటీచేసే ఏ అభ్యర్థి కూడా నచ్చకుంటే మనం నోటాను నొక్కొచ్చు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి 1961 రూల్ 49(ఓ) కింద ఈ హక్కును ఓటర్లు వాడుకోవచ్చు. నోటా అంటే ‘‘నన్ ఆఫ్ ది ఎబో’’ (ఎవరూ కాదు) అని అర్థం. కొన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పట్ల ప్రజలకు అసంతృప్తి ఉంటుంది. అందులో నచ్చని వారుంటే తిరస్కరించే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లకు కల్పించింది.
We’re now on WhatsApp. Click to Join
‘నోటా’ రాకముందు కూడా..
ప్రజాప్రాతినిధ్య చట్టం – 1961లోని సెక్షన్ 49(ఓ) ప్రకారం నోటా పద్ధతి కొన్ని దశాబ్దాల క్రితమే మన దేశంలో అమల్లోకి వచ్చింది. అయితే ఆ పద్ధతి కాస్త విభిన్నంగా ఉండేది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను తిరస్కరించే ఓటరు నేరుగా పోలింగ్ బూత్లోని ప్రిసైడింగ్ అధికారిని కలవాల్సి వచ్చేది. 17-ఎ ఫారం తీసుకుని ఫలానా అభ్యర్థులను తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం చేసి, బ్యాలెట్ పెట్టెలో వేయాల్సి వచ్చేది. రహస్య బ్యాలెట్ విధానానికి ఇది విరుద్ధమని అప్పట్లో భావించేవారు. దీనివల్ల ఓటరు భద్రతకు కూడా విఘాతం కలిగేది. ఈవీఎంలు అందుబాటులోకి రావడం వల్ల నోటా మీటను ఎన్నికల సంఘం తీసుకొచ్చింది.
Also Read :Phone Tapping : ‘ఫోన్ ట్యాపింగ్’ దడ.. మీ ఫోన్ ట్యాప్ అయితే ఇలా గుర్తించండి
- ఓటింగ్ యంత్రాలలో నోటాను(NOTA) అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ఎన్నికల సంఘం 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు వివరించింది.
- అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దీనిని వ్యతిరేకించినా, పలు సంస్థలు, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి.
- దీంతో నోటాను అమల్లోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు 2013 సెప్టెంబరు 27న సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.
- ఓటింగ్ యంత్రాలలో అభ్యర్థుల గుర్తుతో పాటు ‘నోటా’ను 2014 ఎన్నికల టైంలో తొలిసారిగా తీసుకొచ్చారు.
- పోటీచేసే అభ్యర్థులు నచ్చకుంటే దీనిని వినియోగించుకునే అవకాశమిచ్చారు.
- 2014లో జరిగిన శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో, 2018 శాసనసభ, 2019 పార్లమెంటు ఎన్నికల్లో, 2023లో జరిగిన 5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈవీఎంలో నోటాను పొందుపరిచారు.
- త్వరలో జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ నోటా ఆప్షన్ ఈవీఎంలో ఉంటుంది. ఆ బటన్ నొక్కితే ఓటు ఎవరికీ పడదు. ఓటు హక్కుగా నోటాను వినియోగించుకున్నట్లు పరిగణిస్తారు.
Also Read : TDP – Social Equations : టీడీపీ సగానికిపైగా అసెంబ్లీ సీట్లు మూడు వర్గాలకే!
Related News
Modi Vs Rahul : ‘యువరాజు’ను భారత ప్రధాని చేయాలని పాక్ తహతహ : ప్రధాని మోడీ
Modi Vs Rahul : కాంగ్రెస్ యువరాజును(రాహుల్ గాంధీ) భారత తదుపరిగా ప్రధానమంత్రిగా చేయాలని పాకిస్తాన్ తహతహలాడుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు.