Tamil Nadu Election 2026 : రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల బరిలో గెలుపే లక్ష్యంగా యూడీఎఫ్ కూటమి భారీ హామీలను ప్రకటించింది. అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, కాలేజీ విద్యార్థినులకు నెలకు రూ.1000 ఆర్థిక సాయం, మరియు సంక్షేమ పింఛన్లను ఏకంగా
- Author : Sudheer
Date : 26-03-2026 - 11:34 IST
Published By : Hashtagu Telugu Desk
కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కోళికోడ్ వేదికగా జరిగిన యూడీఎఫ్ (UDF) ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆన్లైన్ ద్వారా పాల్గొని అధికార ఎల్డీఎఫ్ (LDF) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి విస్తరిస్తోందని, డ్రగ్స్ కేసుల్లో కేరళ దేశంలోనే రెండో స్థానంలో ఉండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. శబరిమల ఆలయంలో బంగారం మాయమైన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, సాక్షాత్తు అయ్యప్ప స్వామినే గౌరవించని కమ్యూనిస్టు ప్రభుత్వం సామాన్య ప్రజలను ఎలా గౌరవిస్తుందని రాహుల్ ప్రశ్నించారు.
ముఖ్యంగా బీజేపీ, కమ్యూనిస్టుల మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే తనలాంటి ప్రతిపక్ష నేతలపై ఈడీ కేసులు పెట్టి వేధిస్తున్న కేంద్ర ప్రభుత్వం, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ముఖ్యమంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. బీజేపీ-లెఫ్ట్ పార్టీల రాజకీయ ఎజెండా ఒక్కటేనని, ప్రజలకు జవాబుదారీతనం లేని ఈ రెండు శక్తులు కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు. తనపై 40 కేసులు పెట్టినా, ఎన్ని గంటలు విచారించినా తాను వెనక్కి తగ్గేది లేదని రాహుల్ స్పష్టం చేశారు.
ఎన్నికల బరిలో గెలుపే లక్ష్యంగా యూడీఎఫ్ కూటమి భారీ హామీలను ప్రకటించింది. అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, కాలేజీ విద్యార్థినులకు నెలకు రూ.1000 ఆర్థిక సాయం, మరియు సంక్షేమ పింఛన్లను ఏకంగా రూ.3 వేలకు పెంచుతామని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఏప్రిల్ 9న జరగబోయే ఎన్నికలు కేరళ భవిష్యత్తును, లౌకికత్వాన్ని కాపాడేవని, యువత ఉపాధి కోసం ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వరాల జల్లు మరియు బీజేపీ-సీపీఎం బంధంపై ఆయన చేసిన విమర్శలు కేరళ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.