Bharath Jodo Yatra : బసవరాజు బొమ్మైకి రాహుల్ ట్వీట్.. రక్షించాలంటూ!!
కాంగ్రెస్ సీనియర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నాటకలో సాగుతోంది
- By hashtagu Published Date - 06:24 AM, Thu - 6 October 22
కాంగ్రెస్ సీనియర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నాటకలో సాగుతోంది. ఈ క్రమంలోనే నాగర్హోళె టైగర్ రిజర్వ్లో తీవ్రంగా గాయపడిన ఏనుగు పిల్లకు చికిత్స అందించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ టైగర్ రిజర్వ్ను సందర్శించాం. ఈ సమయంలో మేము గాయపడిన ఏనుగు పిల్లను దాని తల్లితో చూశాము. దాని తోక లోతైన గాయాలున్నాయి. ప్రాణాల కాపాడుకునేందుకు పోరాడుతోంది. ఆ ఏనుగు పిల్లకు చికిత్స అందించాల్సిన అవసరం ఉందంటూ ట్వీట్ చేశారు. .
రాజకీయాలను పక్కన పెట్టి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. సరైన వైద్యం అందిస్తే ఆ ఏనుగు పిల్ల బతుకుందన్న నమ్మకం ఉందన్నారు. దానిని రక్షించడానికి మీరు సకాలంలో సహాయాన్ని అందిస్తారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను అంటూ తెలిపారు. కాగా ఆ ఏనుగు పిల్ల ఫొటోను కూడా రాహుల్ ట్వీట్ చేశారు. అందులో ఓ తల్లి ప్రేమ అని రాశాడు. ఈ అందమైన ఏనుగు గాయపడిన దాని చిన్న పిల్లను చూసి నేను చాలా బాధపడ్డాను అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడా ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
A mother’s love.
I felt so sad to see this beautiful elephant with her injured little baby fighting for its life. pic.twitter.com/65yMB37fCD
— Rahul Gandhi (@RahulGandhi) October 5, 2022
Related News
Lok Sabha Poll : కాంగ్రెస్ పరువు తీస్తున్న మల్కాజ్ గిరి అభ్యర్థి..?
దేశం కోసం రాజీవ్ గాంధీ , ఇంద్ర గాంధీ వంటి వారు ప్రాణ త్యాగాలు చేసారని అని చెప్పబోయి.. ఇంద్రా గాంధీ, రాహుల్ గాంధీ లు ప్రాణాలు అర్పించారని చెపుతూ వస్తుంది