Autorickshaw Driver: మానవత్వం చాటుతున్న కేరళ ఆటో డ్రైవర… రోడ్డు ప్రమాద బాధితులనుజ…!
కేరళలోని ఓ ఆటో డ్రైవర్ మానవత్వం చాటుతున్నాడు. 45 కిలో మీటర్ల ఉన్న పాలక్కాడ్-కులపుల్లి రదహదారిలో దశాబ్ధకాలం పాటు పి.
- By Hashtag U Published Date - 01:53 PM, Mon - 23 May 22
కేరళలోని ఓ ఆటో డ్రైవర్ మానవత్వం చాటుతున్నాడు. 45 కిలో మీటర్ల ఉన్న పాలక్కాడ్-కులపుల్లి రదహదారిలో దశాబ్ధకాలం పాటు పి. గోపాలకృష్ణన్ అనే ఆటో డ్రైవర్ రోడ్డు ప్రమాదాలకు గురయ్యే వారిని ఉచితంగా ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు. గోపి లక్కిడిగా ప్రసిద్ధి చెందిన ఆటోరిక్షా డ్రైవర్.. బాధితులను ఉచితంగా సమీపంలోని ఆసుపత్రులకు తీసుకెళతాడు. అందుకే మోటారు వాహనాల శాఖ లక్కిడి ఏరియాలోని క్విక్ రెస్పాన్స్ టీమ్ కన్వీనర్గా చేసింది. 2009లో పాలక్కాడ్ టౌన్ బస్ స్టేషన్ సమీపంలో ఒక కారు అతనిని ఢీకొనడంతో అక్కడి ఉన్న వారు ఆయన్ని కాపాడి సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో మరో జీవితాన్ని పొందాడు. ఎవరూ సహాయం చేయడానికి సిద్ధంగా లేనందున తాను 20 నిమిషాలు రోడ్డుపై పడుకున్నానని.. చివరకు సురేష్ అనే వ్యక్తి తనను జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడని గోపీ గుర్తు చేసుకున్నారు. ప్రమాదంలో అతని కాలుపై అనేక గాయాలు కావడంతో ఎనిమిది నెలలు మంచానికి పరిమితమయ్యాడు. ఆ తర్వాత తన మోటార్సైకిల్ని అమ్మేసి ఆటోరిక్షా కొన్నాడు.
ప్రమాదం తరువాత తాను రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నానని గోపాలకృష్ణన్ చెప్పారు. కొన్నిసార్లు, అతను వారితో పాటు అంబులెన్స్లలో త్రిసూర్, పెరింతల్మన్నలోని ఆసుపత్రులకు కూడా వెళ్లాడు. కోవిడ్ సమయంలో, నామమాత్రపు ఛార్జీల కోసం వందలాది మంది పాజిటివ్ రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఆయన ఆటోని ఉపయోగించాడు. తనకు ప్రజల నుండి, హైవే పోలీసుల నుండి అర్ధరాత్రి కాల్స్ వస్తున్నాయని.. తాను అలాంటి కేసులన్నింటికీ హాజరవుతానని గోపాల్కృష్ణన్ తెలిపాడు . ఒట్టప్పలంలోని వల్లువనాడ్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రోహిత్ గోపి సేవలను కొనియాడారు. గోపి చాలా మంది రోగులను తమ ఆసుపత్రికి తీసుకువచ్చాడని… ఇలా కనికరం ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని తెలిపారు. అతను తన రోజువారీ సంపాదనతో ఇవన్నీ చేస్తాడు. గోపి ప్రయత్నాలకు అతని భార్య సరిత మద్దతు ఉందని.. వీరికి ఇద్దరు పిల్లలు గోకుల్ కృష్ణ గోష్ కృష్ణ ఉన్నారు..
Related News
Optical Illussion : చిత్రంలో విచిత్రం.. మెదడుకు పదును పెట్టు.. పాము ఎక్కడుందో కనిపెట్టు..!
ప్రస్తుతం సోషల్ మీడియా వినోదానికి, విజ్ఞానానికి వేదికగా మారుతోంది. మీ కంటి చూపు, మెదడుకు పదును పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.