Jagga Reddy: త్వరలో పార్టీ పదవులకు జగ్గారెడ్డి రాజీనామా.. అధిష్ఠానానికి లేఖ!
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాంబు పేల్చారు. త్వరలో పార్టీ పదవికి , కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
- By Siddartha Kallepelly Published Date - 06:12 PM, Sat - 19 February 22
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాంబు పేల్చారు. త్వరలో పార్టీ పదవికి , కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. పార్టీ వీడినా గాంధీ కుటుంబం పై గౌరవం తో ఉంటానని పేర్కొంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు మూడు పేజీల లేఖను విడుదల చేసారు. ఈ ప్రకటన విడుదల చేసిన నాటి నుండి తాను కాంగ్రెస్ గుంపులో ఉండనని స్పష్టం చేసారు. ఇక మొదటి నుండి టిపిసిసి చీఫ్ గా రేవంత్ నియామకంపై అభ్యంతరాన్ని తెలిపిన జగ్గారెడ్డి తాజాగా కూడా రేవంత్ కేంద్రంగానే విమర్శలు చేసారు. కాంగ్రెస్ లో సడన్ గా వచ్చి లాబీయింగ్ చేసి పీసీసీ కావొచ్చని, సొంత పార్టీలోనే తనపై కుట్రపూరితంగా కొందరు కోవర్టుగా ముద్రవేస్తున్నారని, పార్టీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని కొందరు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు.
గతంలో పార్టీలో వివాదాలు ఉన్న హుందాగా ఉండేదని, కానీ ఇప్పుడు ఆ హుందాతనం లేదని జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి ప్రజల్లో స్వతంత్రంగా సేవ చేస్తానని, ఇప్పటికైనా పార్టీలో ఎవ్వరు కోవర్టులో అధిష్టానం గుర్తించాలని ఆయన కోరారు. 2017 లో అధినేత రాహుల్ గాంధీ సభ పెట్టమంటే సభ పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదని ఆ సమయంలో తాను సభ నిర్వహించినట్టు తెలిపిన జగ్గారెడ్డి ఆ సభ ద్వారానే రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడిందని జగ్గారెడ్డి గుర్తు చేసారు. పార్టీ కోసం కష్టపడిన తనని కోవర్టు అంటున్నారని, సభను నిర్వహించకుండా మౌనంగా ఉన్న నేతలు కోవర్టులు కాదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నుండి అభ్యర్థిని పెట్టకుంటే తాను మెదక్ జిల్లా నుండి అభ్యర్థిని పెట్టి కోట్లు ఖర్చు పెట్టి పార్టీ కి ఒక్క ఓటు తగ్గకుండా పార్టీ పరువు నిలిపానని జగ్గారెడ్డి తెలిపారు. కనీసం అభ్యర్థిని పెట్టకుండా పార్టీ సీనియర్లు మౌనంగా ఉన్నారని, అభ్యర్థిని పెట్టినవారు కోవర్టులా? పెట్టనివారు కోవర్టులా అని ఆయన ప్రశ్నించారు. హుజూరబాద్ ఉప ఎన్నికల్లో 40 వేల కాంగ్రెస్ ఓట్లను మూడువేల ఓట్ల కు పరిమితం చేసిన వాళ్ళు కోవర్టులా? గాంధీ కుటుంబం పై బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముందు ఖండించింది తానేనని, పార్టీలో పదవులు అనుభవిస్తున్నవాళ్ళు స్పందించకుండా, మౌనంగా ఉన్నవాళ్లు కోవర్టులా? అసలు కోవర్టులు ఎవరో గుర్తించాలని జగ్గారెడ్డి అధిష్టానాన్ని కోరారు.
Related News
AP : శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు సిగ్గుచేటు: చంద్రబాబు
Chandrababu: దేశంలోని తూర్పు ప్రాంత ప్రజలు చైనీయుల్లా కనిపిస్తారు. పశ్చిమాన ఉండే వారు అరబ్ జాతీయుల్లా ఉంటారు. ఉత్తరాది వారు తెల్ల జాతీయులలా కనిపిస్తారు. అంటూ..కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా(Sam Pitroda) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన వ్యాఖ్యలపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పంద�